మే,21 నుండి జూన్,21వరకు కళాశాలలో విద్యార్థులకు యోగాసనాలు...
మే,21 నుండి జూన్,21వరకు కళాశాలలో విద్యార్థులకు యోగాసనాలు
VS9TV న్యూస్,బనగానపల్లె :
ప్రభుత్వ డిగ్రీ కళాశాల బనగానపల్లెలో ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు మే,21 నుండి జూన్,21వరకు కళాశాలలో విద్యార్థులకు యోగాసనాలు శిక్షణ నిర్వహిస్తున్నట్లు కళా శాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.లలిత పేర్కొన్నారు.ఈ మేరకు మంగళవారం కళాశాలలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ యోగ అనేది జీవితం లో ఒక భాగం అని దానిని నిత్యం ఆచరించడం ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆ నందాన్ని పొందవచ్చని తెలిపారు.అనేక వ్యాధులను నయం చేసే ఆసనాలు యోగాలో ఉ న్నాయని తెలిపారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని కళాశాలలో నెలరోజులపాటు ఒకే భూమి-ఒకే ఆరోగ్యం కోసం యోగ అనే నినాదంతో కళాశాలలో యోగా శిక్షణ విద్యార్థు లకు అందించడం జరుగుతున్నది.విద్యార్థులలో యోగా పట్ల అభిరుచిని పెంపొందించేం దుకు అనే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది.యోగపై సమావేశాలు,శిక్షణ, పోటీలు జరుగుతున్నవి.దీనిలో భాగంగా నేడు డిగ్రీ కళాశాలలో యోగా మాస్టర్ తిరుపా లయ్య ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు యోగాసనాలు చేయించడం జరిగింది.తిరు పాలయ్య మాట్లాడుతూ యోగా మానసిక శారీరక అభివృద్ధికి తోడ్పడుతుందని యోగ వ ల్ల విద్యార్థులలో జ్ఞాపకశక్తిని పెంపొందించవచ్చని,అలాగే మానసిక ప్రశాంతతను పొంద వచ్చని తెలిపారు.యోగాను విద్యార్థిని విద్యార్థులలో తీసుకెళ్లడం ద్వారా వారి మానసిక శారీరిక వికాసానికి దారితీస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కే.బడే సాహెబ్, ఐ క్యూఏసి కోఆర్డినేటర్ ఎన్.ఉమామహేశ్వర రెడ్డి,ఫిజిక్స్ లెక్చరర్,డాక్టర్ ఎస్.మహమ్మద్ గౌస్,జువాలజీ లెక్చరర్,ఆంజనేయులు,ఫిజికల్ డైరెక్టర్,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నా రు.
Comments
Post a Comment