ఏడు నెలల్లో 25పెళ్లిళ్లు చేసుకున్న యువతి...
ఏడు నెలల్లో 25పెళ్లిళ్లు చేసుకున్న యువతి
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
రాజస్తాన్ కు చెందిన అనురాధ అనే యువతి కేవలం ఏడు నెలల సమయంలోనే 25పెళ్లి ళ్లు చేసుకుంది.పెళ్లి అయిన వెంటనే అత్తగారింట్లో అందరికీ మత్తు మందు కలిపిన భోజ నాలు పెట్టేది.వారు మత్తులోకి జారుకున్నాక డబ్బులు,బంగారంతో పారిపోయేది...వివ రాల్లోకి వెళితే... రాజస్థాన్ కు చెందిన అనురాధ పాసవాన్ పీహెచ్ డీ చేసింది.కేవలం డబ్బు,నగదు లక్ష్యంగా ఏకంగా 25మందిని పెళ్లాడింది.ఈ మహిళ పెళ్లి జరిగే తీరు,పెళ్లి తర్వాత జరిగే దొంగతనం,ఎప్పుడు సేమ్ ఫార్మాట్ లో జరుగుతుండేది.కాని ఎల్లకాలం మోసం సాగదు కదా...26వ పెళ్లి కోడుకు తాను మోసపోయాను అంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.వాళ్లు కూపీ లాగీ, వల వేసి కిలేడీని పట్టుకున్నారు.విచారణలో నేను ఒక ఒం టరి మహిళను,ఒక సోదురుడు ఉన్నాడు కాని,ఉద్యోగం చేయడు,డబ్బులు సంపాదించ డు.నేను పేదరాలిని అంటూ అందరికి చెప్పుకునేది.ఎవరైనా ఆసక్తిగా ఉంటే,తనపై ప్రేమ కురిపిస్తే,వెంటనే తన గ్యాంగ్ నుంచి ఒకరిని రంగంలోకి దింపి,పెళ్లి సంబంధం మాట్లా డేది.అసలే అందమైన అమ్మాయి,ఆపైన పుట్టెడు కష్టాలు. దాంతో జీవితం ఇద్దాం అనుకు న్న మగవాళ్ల పరిస్థితి దారుణంగా మారుతుంది.జీవితం దుర్భరంగా మారుతుంది.అసలు ఆమెకు జీవితం ఇద్దాం అనుకున్న ఆలోచన ఎందుకు వచ్చిందని విరక్తి పుడుతుంది.పెళ్లి అ వుతుంది.మూడు రాత్రులు గడుస్తాయి.అ తర్వాత అత్తారింట్లో ఏం నగలు ఉన్నాయో, డబ్బులు ఎక్కడ దాచారో,విలువైన వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని వివరాలు అను రాధ తెలుసుకుంటుంది.అదును చూసి ఇంట్లో వారి మత్తు మందు కలిపి వారు గాఢ నిద్ర లోకి జారుకోగానే,తన గ్యాంగ్ ను రంగంలోకి దింపుతుంది.మొత్తం దోచుకుని వెళ్లిపో తుంది.తెల్లారి లేచి చూస్తే పెళ్లి కూతురు ఉండదు.ఇంట్లో డబ్బులు ఉండలు.నగలు మా యం అవుతాయి.మోసపోయం అనే విషయం అర్ధమవుతుంది.ఇలా 25మంది మోసపో యారు.అనురాధా అనే పేరు వినిపిస్తేనే ఉలిక్కి పడతారు.ఈ 25 మందికి కూడా తన ఓరి జినల్ పేరు తెలియదు.అంతా ఫేక్.చెప్పిన పేరు, పరిచయం చేసిన కుటుంబ సభ్యుడి పే రు,ఇంటి పేరు,అడ్రస్,సర్టిఫికెట్లు అంతా కూడా ఫేక్.ఎవరైనా ఏం చేస్తారు.ఏమని చెబుతా రు...కాని ఒక్క పెళ్లి కొడుకు జరిగిన మోసం మొత్తాని తీసుకెళ్లి పోలీసులకు చెప్పారు. కాని పోలీసులకు కూడా అనురాధా అంత ఈజీగా చిక్కలేదు.కిలేడీ పాసవాన్ ను పట్టుకు నేందుకు,పోలీసులు చాలా కష్టపడ్డారు.తన దారిలోనే వెళ్లారు.పెళ్లి సంబంధం మాట్లాడి నట్లే మాట్లాడి,గ్యాంగ్ తో సహా హోల్ సేల్ గా పట్టుకున్నారు. నిత్య పెళ్లి కూతురు పట్టుబ డటంతో,గతంలో తనని పెళ్లి చేసుకుని మోసపోయిన బ్యాచ్ అంతా బయటికి వచ్చి,గ గ్గోలు పెడుతున్నారు.

Comments
Post a Comment