బలగం సినిమా రిపీట్... 60ఏళ్ల వయసులో పంతాలు విడిచి మాట్లాడుకున్న అన్నదమ్ముళ్లు...
బలగం సినిమా రిపీట్... 60ఏళ్ల వయసులో పంతాలు విడిచి మాట్లాడుకున్న అన్నదమ్ముళ్లు...
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
రాజన్న సిరిసిల్ల జిల్లా,కోనరావుపేట మండలం,కొల నూరు గ్రామంలో అన్నదమ్ముళ్లు మామిండ్ల నాగయ్య, మామిండ్ల రాములు చిన్న చిన్న విబేదాలతో 10ఏళ్ల కింద విడిపోయారు.ఒకే గ్రామంలో ఉన్నా అన్నదమ్ము ళ్లు మాట్లాడుకోవడం లేదని,ఇద్దరిని ఎలా అయినా కల పాలని నాగయ్య కుమారుడు శ్రీనివాస్ ఎన్నో సార్లు ప్ర యత్నించి విఫలమయ్యడు.ఇదిలా ఉండగా గత నాలు గు రోజుల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో నాగయ్య,రామయ్యల మేనల్లుడు కూన తిరుపతి మరణించగా..మూడు రోజుల కార్యానికి అన్నదమ్ముళ్లు ఇద్దరు హాజరయ్యారు.ఈక్రమం లో ఇద్దరిని కలపాలని శ్రీనివాస్..వారి పాత రోజులను,జ్ఞాపకాలను గుర్తుచేయడంతో ఇ ద్దరు కన్నీరు పెట్టుకున్నారు.ఆరు పదుల వయసులో,కాటికి వెళ్లే ముందు పంతాలు ఎందు కని ఇకనుండి అయినా కలిసి బ్రతుకుదామని,యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఆలింగ నం చేసుకొని కంట తడి పెట్టుకున్నారు.

Comments
Post a Comment