మంచినీటి సమస్య పరిష్కారం చేయకపోతే...ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కార్యాలయం ముట్టడిస్తాం...డివైఎఫ్ ఐ...
మంచినీటి సమస్య పరిష్కారం చేయకపోతే ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కార్యాలయం ముట్టడిస్తాండివైఎఫ్ ఐ
VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
మంచినీటి సమస్య పరిష్కారం చేయకపోతే ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కార్యాలయం ముట్టడి స్తామని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ హెచ్చరించారు.గురువా రం గ్రామీణ నీటి సరఫరా,పారిశుద్ధ్య శాఖ డిఈ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ ఆధ్వ ర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు రాఘవేంద్ర,నగేష్ మాట్లాడుతూ ఉల్చాల గ్రామంలో తాగునీటి సమస్య వలన ప్రజలు తీవ్రం గా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.అనేకసార్లు వినతి పత్రాలు అందజేసిన ప్రజాప్రతి నిధులకు తెలియజేసిన సమస్య పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పా రు.అనేక సంవత్సరాలు నుండి తాగునీటితో ఇబ్బంది పడుతున్న గ్రామప్రజలు కూటమి ప్ర భుత్వానికి ఓట్లు వేయడం ద్వారా మా సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది అని,శాస నసభ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో ఓట్లు వేశారని తెలియచేశారు.ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తవుతున్న ఇప్పటికీ సమస్య పరిష్కారం చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు.ఉల్చాల గ్రామంలో పది రోజులు,20రోజులు నెల రోజు ల కొకసారి మంచినీళ్లు తాగాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయకపోతే గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ సుపరిండెంట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ధర్నా దగ్గరికి వచ్చిన డిఈ అమల,ఏఈ రంగస్వామి నేటి సాయంత్రంలోగా చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేసి,రేపటిలోగా నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ప్రకాష్,గ్రామకార్యదర్శి హరి కిషన్ రెడ్డి,గ్రామ నాయకులు అంజి,రాము,రఘు వరన్,విశ్వనాథ్,గోవర్ధన్, హరి,సాయి,తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment