జూన్ ఒకటి నుండి రేషన్ షాపుల్లో రేషన్ పంపణీకి సర్వం సిద్ధం...నాదెండ్ల మనోహర్,పౌరసరఫరాల శాఖ మంత్రి...
జూన్ ఒకటి నుండి రేషన్ షాపుల్లో రేషన్ పంపణీకి సర్వం సిద్ధంనాదెండ్ల మనోహర్,పౌరసరఫరాల శాఖ మంత్రి
VS9TV న్యూస్,విజయవాడ ప్రతినిధి :
కార్డుదారుల సౌలభ్యం కోసం జూన్ ఒకటో తేది నుండి రేషన్ షాపుల ద్వారా రేషన్ సరు కులు పంపిణీకి సర్వం సిద్ధం అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పా రు.ఎండియు విధానం అమలులో ఉన్నపుడు ఈ పోస్లో ఉన్న సాఫ్ట్వేర్ ను తొలగించి రే షన్ డీలర్ ద్వారా పంపిణీ కోసం రూపోందించిన సాఫ్ట్వేరు క్షేత్ర స్థాయిలో పరిశీలించే ని మిత్తం విజయవాడ మధురానగర్ రేషన్ డిపో నెంబరు 218ని పౌరసరఫరాశాఖ కమీష నర్ సౌరబ్ తో కలిసి సందర్శించారు.ఈపోస్లో లాగిన్ నుండి కార్డు నెంబరు ఎంటర్ అ య్యే విధానం కార్డుదారుని వేలిముద్ర,కంటిపాప ద్వారా సరుకులు నమోదయ్యే విధానం పరిశీలించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎండియు వాహ నం ఎపుడు వస్తుందో వెళుతుందో తెలియని దుస్తితి ఉందని,దీంతో కార్డుదారులు రేషన్ కోసం వాహనం కోసం రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఉందని అన్నారు.ఇపుడు కార్డుదా రులకు ఆ కష్టాలు ఉండవని చె ప్పారు.నెలలో ఒకటో తేది నుండి 15వ తేది వరకు ఉద యం 8-00 నుండి మద్యహ్నం 12-00 వరకు సాయంత్రం 4-00 నుండి 8-00 గంట ల వరకు రేషన్ దుకాణంలో సరుకులు తీసుకోవచ్చని చె ప్పారు.అదేవిదంగా 65 సంవత్స రాలు దాటిన ఒంటరి వృద్ధులు,వికలాంగులు, భార్యభర్తలు ఇద్దరు వృద్దులైన వారి జాబి తాలు రేషన్ షాపుల వారికిగా సిద్ధం చేశామని వారికి 1వ తేదీ నుండి 5వ తేదిలోగా డీల ర్ ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు ఇస్తారని చెప్పారు.ఇల్లు మారి వేరే ప్రాంతాలకు వెళ్లిన వా రికి కూడా పోర్టబిలిటీ విధానం ద్వారా సమీప రేషన్ దుకాణంలో రేషన్ పొందవచ్చని చె ప్పారు.రేషన్ దుకాణాలలో అవినీతి జరగకుండా ప్రభుత్వం సరికోత్తయాప్ ను రూపొం దించిందని చెప్పారు.ఈ యాప్లో డీలర్ వివరాలు ఫోటోతో సహా వస్తాయన్నారు.యం ఎల్ ఎస్ పాయంట్ నుండి సరుకు ఎంత వచ్చింది. కార్డుదారులకు ఎంత పంపిణీ చేశార నే వివరాలు,రేషన్ దుకాణం వద్ద జనం ఎక్కువ మంది ఉన్నా వెంటనే ఈ యాప్ ద్వారా తెలుస్తుందన్నారు.

Comments
Post a Comment