మహిళలు,బాలికల భద్రతకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత..."ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్" ఏర్పాటు...డీజీపీ హరీష్ కుమార్ గుప్తా,..

మహిళలు,బాలికల భద్రతకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ 
అత్యంత ప్రాధాన్యత
"ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్" ఏర్పాటు
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా,

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :

రాష్ట్రంలో గత 10 నెలల్లో పోక్సో,వరకట్న హత్యలు,మహిళల హత్యలు,రేప్ మరియు గ్యాంగ్ రేప్ కేసుల్లో 169మంది నిందితులకు న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించడం జరిగిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.మహిళలు,బాలికల భద్రతకు ఆంధ్రప్ర దేశ్ పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.మహిళలపై జరిగే వ్యవస్థీకృత నేరాలను అరికట్టడానికి ఐజీపీ రాజకుమారి నేతృతంలో "ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్" ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

శక్తి యాప్ : మహిళల భద్రతకై అత్యంత అధునాతన ఫీచర్లు కలిగిన "శక్తి యాప్" ఇపు డు హిందీ,ఇంగ్లీష్ భాషల్లో యూజర్లకు అందుబాటులో ఉండటంతో పాటుగా Play Store (Android Phone) మరియు IOS (Apple Phone) నుండి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు.శక్తి యాప్ ను అందుబాటులోకి తీసుకు వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 1,52,16,440 మంది శక్తి యాప్ ను తమ మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకోవడం జరిగిందన్నారు.అత్యవసర సహాయం కోసం (SOS) 11,60, 14 6 మంది కాల్ చేయగా వీటిలో 34,192 తక్షణమే స్పందించవలసిన కాల్స్ గా  నమో దు చేసుకొని, 3,193 FIRలు నమోదు చేయడం జరిగిందన్నారు.అంతేకాకుం డా ఈ యాప్ ద్వారా 242ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్టులు,సేఫ్ ట్రావెల్ కోసం 160,తప్పిపో యిన పిల్లల కోసం 18మంది ఈ యాప్ ద్వారా రిపోర్టు చేయడం జరిగిందన్నారు.

శక్తి టీమ్స్ : మహిళల భద్రతకై రాష్ట్రవ్యాప్తంగా ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో 164 శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ శక్తి టీమ్ లు మహిళా భద్రతకు అత్యం త ప్రాధాన్యతనిస్తూ మఫ్టీలో నిరంతరం పహారా కాస్తున్నాయన్నారు.మహిళలపై తరచూ నేరాలు జరిగే 900 హాట్ స్పాట్స్ ను గుర్తించడం జరిగిందన్నారు.ఈ హాట్ స్పాట్ ల మీద నిరంతరం నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.శక్తి యాప్ యొక్క ఆవశ్యకత, ప్రా ధాన్యత,ఉపయోగాల గురించి అవగాహన కల్పిస్తూ రైల్వే స్టేషన్లు,బస్ స్టాండ్లు,పబ్లిక్ ప్రదే శాలు,గ్రామీణ ప్రాంతాల మహిళలకు విస్తృతస్థాయిలో 12,119 అవగాహన శిబిరాలు " శక్తి టీమ్స్" నిర్వహించి 17,665 ప్రాంతాలను సందర్శించడం జరిగిందన్నారు.మహి ళలపై "ఈవ్ టీజింగ్" కు పాల్పడే 254మందిని గుర్తించడం జరిగిందని తెలిపారు.వీరి మీద నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మహిళల పట్ల పురుషుల్లో గౌరవ భావం పెంపొంచేందుకు మార్గదర్శకాలు రూపొందించడంతో పాటుగా,స్కూళ్లు,కాలేజీల స్థాయి నుండే జండర్ సెన్సిటివిటీపై అవగాహన కల్పించాలని అన్నారు.మహిళలపై జరిగే హింస,లైంగిక దాడులు,వేధింపులకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా మహిళా సాధికారితకు పెద్దపేట వేయాలని డిజిపీ తెలియచేశారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...