పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్...ఎన్నికల సంఘం...
పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్...ఎన్నికల సంఘం...
VS9TV న్యూఢిల్లీ :
పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయం తీసుకుంది.డిపాజిట్ చేసే సదుపాయం లేకపోవడంతో ఓటర్లు తమ మొబైళ్లను దుస్తుల్లో కనిపించకుండా దాచుకొని పోలింగ్ బూత్ల్లోకి ప్రవేశిస్తున్నా రు.దీన్ని నిరోధించడానికే కౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు శుక్రవారం ఈ సీ తెలిపింది.ఓటర్లకు అనధికారిక ఓటరు గుర్తింపు స్లిప్పులు పంపిణీ చేసేందుకు రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రానికి 200మీటర్లలో ఏర్పాటు చేసే కేంద్రాల దూరాన్నీ తగ్గించిం ది.100 మీటర్ల దూరంలో ఓటర్ల స్లిప్పుల పంపిణీ కేంద్రాలను నిర్వహించుకోవచ్చని తెలి పింది.ఈ కొత్త నిబంధనలను ఏడాది చివర్లో జరిగే బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఈసీ అమలు చేయనుంది.

Comments
Post a Comment