లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్టర్...
VS9TV న్యూస్,ఖమ్మం ప్రతినిధి :
ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ అరుణ లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడింది.ఆమెను ఏ సీబీ అధికారులు వలవేసి నేరుగా పట్టుకున్నారు.వివరాల ప్రకారం...ఖమ్మం జిల్లా,రూర ల్,మండలం,తల్లంపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రెండు వేల గజాలు తన కొడుకు పే రు మీద గిఫ్ట్ డీడ్ కోసం సబ్ రిజిస్టర్ అరుణను ఆశ్రయించగా రూ.50 వేలు డిమాండ్ చేసింది.దీంతో గత్యంతరం లేక బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాకుమెంట్స్ రైటర్ పుచ్చాకాయల వెంకటేశ్వర రావు ద్వారా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కు రూ.30వేలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు గత సోమవారం రిజిస్ట్రేషన్ చేసేందుకు డాకుమెంట్స్ రైటర్ పుచ్చాకాయల వెంకటేశ్వర రావు ద్వారా రూ.30వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి దాడులు చేశారు.ఆమెను బహిరంగంగా పట్టుకున్నారు.గత తొమ్మిది నెలల క్రితమే సబ్ రిజిస్టర్ అరుణ వరంగల్ జిల్లా నుంచి బదిలీపై రూరల్ కు వచ్చింది.
Comments
Post a Comment