దుకాణాల ద్వారానే పీడీఎస్ బియ్యం పంపిణీ...నాదెండ్ల మనోహర్,ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి...
దుకాణాల ద్వారానే పీడీఎస్ బియ్యం పంపిణీనాదెండ్ల మనోహర్,ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
రాష్ట్రంలో ఇకపై రేషన్ వ్యాన్లు ఉండవని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనో హర్ స్పష్టం చేశారు.జూన్ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్ సరఫ రా చేస్తామని చెప్పారు.65 ఏళ్లు పైబడిన వృద్ధులు,దివ్యాంగులకు ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు.చౌక దుకాణాలు ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వర కు అందుబాటులో ఉంటాయని చెప్పారు.గతంలో పీడీఎస్ వ్యవస్థను కుట్ర పూరితంగా నాశనం చేశారని,9000 వేలకు పైగా వ్యాన్లు ఏర్పాటు చేసి రూ.18వేల కోట్లు దుర్విని యోగం చేశారని మంత్రి నాదెండ్ల ఫైర్ అయ్యారు.కేబినెట్ భేటీ అనంతరం మంత్రివర్గ నిర్ణ యాలను మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు.‘గతంలో పీడీఎస్ వ్యవస్థ ను కుట్ర పూరితంగా నాశనం చేశారు.9000 వేలకు పైగా వ్యాన్లు ఏర్పాటు చేసి రూ. 18 వేల కోట్లు దుర్వినియోగం చేశారు.గత ప్రభుత్వ తీరుతో వినియోగదారులకు సమస్య లు వచ్చాయి.బియ్యం ఏ విధంగా రవాణా జరుగుతుందో తనిఖీ చేశాం.రేషన్ కోసం వ్యా న్లు తెచ్చిన తర్వాత బియ్యం మాఫియా పెరిగింది.వ్యాన్ డ్రైవర్లు కూడా సిండికేట్లో భాగ స్వాములు అయ్యారు.ఇకపై రేషన్ వ్యాన్లు ఉండవు.జూన్ ఒకటో తేదీ నుంచి చౌకధర దుకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తాం.65 ఏళ్లు పైబడిన వృద్ధులు,దివ్యాంగులకు ఇం టి వద్దకే బియ్యం పంపిణీ చేస్తాం.చౌక దుకాణాలు ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.దీపం-2 పథకంలో గ్యాస్ సబ్సిడీ నేరుగా వినియోగదా రుల ఖాతాలోకి బదిలీ అవుతుంది’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Comments
Post a Comment