కర్నూలు బస్ స్టేషన్ కు కేంద్ర కార్యాలయం నుండి 25 కుర్చీలు (3-సీటర్) మంజూరు...
కర్నూలు బస్ స్టేషన్ కు కేంద్ర కార్యాలయం నుండి 25 కుర్చీలు (3-సీటర్) మంజూరుసుధారాణి,కర్నూలు ఇంచార్జి,డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్
కర్నూలు జిల్లా,బస్ స్టేషన్ కు ఒక్కొక్క కుర్చీలో ముగ్గురు కూర్చునే వీలున్న,25 కుర్చీలు (3-సీటర్) కేంద్ర కార్యాలయం ద్వారా మంజూరైనర్లు కర్నూలు ఇంచార్జి డిప్యూటీ చీఫ్ ట్రాఫి క్ మేనేజర్ సుధారాణి పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం కర్నూలు ఇంచార్జి డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సుధారాణి,కర్నూలు బస్టాండులోని సినియర్ సిటిజెన్ లు, కర్నూలు జిల్లా సి.బెళగల్ వాస్తవ్యులు, టీచర్ అనుమన్న,కర్నూలుకు చెందిన వ్యాపారవేత్త సుబ్బా రావు చేతుల మీదుగా వాడుకలోకి తీసుకురావడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా వి భాగం ఏపీఎస్ఆర్టీసీ కర్నూలు జిల్లా వారు బస్టాండులో ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కర్నూలు-2 డిపో మేనేజర్ శర్మ,కర్నూ లు-1 అసిస్టెంట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం,బస్ స్టేషన్ మేనేజర్ కాంచన,ఇతర ఆర్టీసి సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment