33వార్డు,కల్లూరు ఎస్టేట్ లో మురుగు కాలువలు నిర్మించాలి...సీపీఐ...
33వార్డు,కల్లూరు ఎస్టేట్ లో మురుగు కాలువలు నిర్మించాలి...సీపీఐ
VS9TV న్యూస్,కల్లూరు :
కర్నూలు నగరం,33వార్డు,కల్లూరు ఎస్టేట్ లో మురుగునీరు పోవడానికి కొత్త కాలువలు నిర్మించాలని,కొన్ని కాలువలను సరిచేయాలని,ఇక్కడి ప్రజల ఆరోగ్యాలు కార్మికుల ఆరో గ్యాలు కాపాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర సహాయ కార్యదర్శి దంభో ళంశ్రీనివాసరావు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు కార్పొ రేషన్ పరిధిలో చెన్నమ్మ సర్కిల్ నుండి ముజఫర్ నగర్ పోవడానికి దారిలో భారత్ పెట్రో ల్ బంక్ పక్కన ఎస్టేట్ పోవు మార్గంలో కాలువలు లేక మురుగునీరు రోడ్డు మీదకు వచ్చి కుంటల మారింది ఇక్కడ దుర్గంధం వెదజల్లుతుందని అన్నారు.ఈ మార్గంలో నడవడం నేను కూడా దాడి సరిగ్గా లేదు.ఒకవైపు మురికి కుంట,మరోవైపు మురుగు నీరు నిలిచిం దని,ఇక్కడ కార్మికులు వ్యాపారస్తులు ఇంకా వివిధ రకాలుగా అక్కడ జీవనం సాగించే వారు ఆ మార్గం గుండా పోవటం,రావటం జరుగుతుందని చెప్పారు.ఆ సందర్భంలో టూ వీలర్ మీద పోయేవాళ్లు కిందపడి దెబ్బలు తగిలించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయ ని,మరి కొన్ని సందర్భాల్లో ఆ కుంటలో పశువులు ఇరుక్కుపోయిన సందర్భాలు కూడా ఉ న్నాయని పేర్కొన్నారు.కావున మురుగునీరు పోవ డానికి పాతకాలవలు సరిచేసి,కొత్త కాలువలు నిర్మించి ప్రజల ఆరోగ్యాలు కాపాడా లని దంభోళంశ్రీనివాసరావు కోరారు.ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శులు రామాంజనేయులు,రబియా,కృష్ణ నాయక్,తదితరు లు పాల్గొన్నారు.
Comments
Post a Comment