పీ4 కార్యక్రమం కింద నిర్మల ఉన్నత చదువుకు సహకారం...
పీ4 కార్యక్రమం కింద నిర్మల చదువుకు సహకారం
సివిల్ సర్వీసెస్ లో తప్పక ఉత్తీర్ణత సాధిస్తా...నిర్మల
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
రాష్ట్రంలోని పేద కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పీ4 కార్యక్రమం కింద నిర్మల విద్యార్థినికి 21 సెంచరీ ఐ.ఏ.యస్ అకాడ మీ హైదరాబాద్ వారు ఉచిత చదువు, వసతి,భోజన సదుపాయాలతో మూడు సంవత్స రాల డిగ్రీ,ఐ.ఏ.యస్ కోచింగ్ తో పాటు ఒక సంవత్సరం ప్రత్యేక అడ్వాన్స్ శిక్షణ ఇచ్చుట కు సహకారం అందించడానికి ముందుకు వచ్చింది.వివరాలు...ఆదోని మండలం,పెద్ద హ రివనం గ్రామానికి చెందిన విద్యార్థిని నిర్మలది నిరుపేద కుటుంబం...ఆమె తల్లితండ్రులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు.నిర్మల 2023లో పదవ తరగతి పరీక్షల్లో 600కు గాను 537 మార్కులు సాధించింది.అయితే పై చదువులు చదివించడానికి ఆర్ధిక స్థోమత లేక తల్లితండ్రులు బాల్య వివాహం చేసేందుకు ప్రయత్నంచారు.విషయం తెలు సుకున్న అప్పటి కలెక్టర్ సృజన నిర్మలను చదివించేందుకు కృషి చేసి ఆస్పరిలోని కస్తూరి బా గాంధీ కళాశాలలో ఇంటర్మిడియట్ లో చేర్పించారు.ఇంటర్ లో 1000 మార్కులకు గాను 966తెచ్చుకొని ఔరా అనిపించింది.అదేవిదంగా నిర్మల ఐపిఎస్ లక్ష్య సాధనే తన జీ వితాశాయమని,అందుకు తగిన చదువుకు సహకారం అందించాలని సెట్కూరు సీఈఓ వేణుగోపాల్ ని కలిసి అభ్యర్థించింది.దీంతో ఆయన ఈ విషయాన్ని హైదరాబాద్ లోని 21వ సెంచరీ ఐ.ఏ.ఎస్ అకాడమీ వారితో మాట్లాడి నిర్మలకు పీ4 కింద ఉచిత విద్యను అందించాలని కోరారు.ఈ నేపథ్యంలో అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రసాద్ నిర్మలకు డిగ్రీ ఉచి త చదువుతో పాటు,సివిల్స్ కోచింగ్, వసతి,భోజన సదుపాయం ఉచితంగా అందించేం దుకు ముందుకు వచ్చారు.ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ బి.నవ్య నిర్మలను అభినంది స్తూ మంచిగా చదువుకుని ఐపిఎస్ కావాలని ప్రోత్సహించారు.ఇదేవిధంగా పీ4 కార్య క్ర మం క్రింద దాతలు ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా నిరుపేదలకు సహాయ సహ కారాలు అందించాలని తెలిపారు.తదుపరి ముఖ్య ప్రణాళిక అధికారిని సెట్కూర్ సీఈఓ ని వెంటనే ఈ వివరాలు మొత్తం ఆన్లైన్ లో పి4 కార్యక్రమం క్రింద నమోదు చేయించాల ని కోరారు.అనంతరం విద్యార్థిని నిర్మల మాట్లాడుతూ తన ఉన్నత చదువులకు,సహకరి స్తున్న ఎంపీ నాగరాజు,జాయింట్ కలెక్టర్,21 సెంచరీ ఐ.ఏ.యస్ అకాడమీ,సెట్కూరు సీ ఈఓ వేణుగోపాల్ లకు కృతజ్ఞతలు తెలియచేశారు.సివిల్ సర్వీసెస్ లో తప్పక ఉత్తీర్ణత సాధిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్ర దీప్ అకాడమీ డైరెక్టర్లు వరుణ్,వేణు, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్,నిర్మల తల్లితండ్రులు పాల్గొన్నారు.
Comments
Post a Comment