కుప్పం మహిళ శిరీషను ఫోన్‌లో పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు...రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటన...పిల్లల చదువుకు హామీఅన్ని విధాలా అండగా ఉంటానని,ధైర్యంగా ఉండాలని సిఎం భరోసా...

కుప్పం మహిళ శిరీషను ఫోన్‌లో పరామర్శించిన 
ముఖ్యమంత్రి చంద్రబాబు
రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటన
పిల్లల చదువుకు హామీ
అన్ని విధాలా అండగా ఉంటానని,
ధైర్యంగా ఉండాలని భరోసా



VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :

చిత్తూరు జిల్లా,కుప్పం మండలం,నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని చెట్టుకు క ట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషతో సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు.ఫోన్‌లో మాట్లాడి శిరీషను పరామర్శించి,ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయ అని అడిగా రు.పలు సందర్భాల్లో తమను ఇబ్బందిపెట్టారని ఆమె చెప్పారు.ఈ ఘటనలో పిల్లలు,తాను భయపడుతున్నామని ముఖ్యమంత్రికి బాధితురాలు గోడు వెళ్లబోసుకుంది.ఇటువంటి ఘ టన దురదృష్ణకరమని,ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని సిఎం స్పష్టం చేశారు.మా నవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారుల కు ఆదేశాలు ఇచ్చానని సిఎం అన్నారు.శిరీష పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసు కున్నారు.వారిని బాగా చదివించాని సూచించారు.ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అం డగా ఉంటానని...ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు.అప్పుల బాధ,ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలను చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్న శిరీష పరిస్థితిని తెలుసుకున్న ముఖ్య మంత్రి...అప్పటికప్పుడు ఆమెకు రూ.5లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.ముగ్గురు పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని శిరీషకు ఫోన్‌లో సిఎం హామీ ఇచ్చారు. ఘటన,తదనంతర పరిణామాలపై తనకు నివేదిక ఇవ్వాలని,బాధిత కుటుంబానికి అందు బాటులో ఉండి అవసరమైన సాయం పూర్తిగా అందేలా చూడాలని సిఎం అధికారులను ఆదేశించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....