పోరాటాల ఫలితంగా ఎనర్జీ అసిస్టెంట్ బదిలీల గైడ్ లైన్స్ రద్దు...ఎం.డి.అంజిబాబు,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి...
పోరాటాల ఫలితంగా ఎనర్జీ అసిస్టెంట్ బదిలీల గైడ్ లైన్స్ రద్దుఎం.డి.అంజిబాబు,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి
అసిస్టెంట్(జూనియర్ లైన్ మెన్ గ్రేడ్- 2) బదిలీలపై ఇచ్చిన ఏపీ ఈపీడీసీఎల్ యాజమా న్యం ఇచ్చిన గైడ్ లైన్స్ తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు,అన్ని జిల్లాల విద్యుత్ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్లకు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూ నియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ప్రభుత్వం వెంటనే స్పం దించి ఏపీ ఈపీడీసీఎల్ యాజమాన్యం ఎనర్జీ అసిస్టెంట్ (జూనియర్ లైన్ మెన్ గ్రేడ్- 2) గైడ్ లైన్స్ రద్దు చేయడం జరిగిందని కర్నూలు జిల్లా,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) కర్నూలు జిల్లా రీజినల్ అధ్య క్షులు ఎం.డి.అంజిబాబు,ఏపీ ఎస్పీడీసీఎల్ కంపెనీ కమిటీ ఉపాధ్యక్షులు పి.నాగరాజు హ ర్షం వ్యక్తం చేశారు.ఈ మేరకు వారు గురువారం మీడియాతో మాట్లాడారు.గత ప్రభు త్వం రాష్ట్రవ్యాప్తంగా 7529 మంది ఎనర్జీ అసిస్టెంట్స్ (జూనియర్ లైన్ మెన్ గ్రేడ్- 2) ని యమించడం జరిగిందని,మీరందరూ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నారు.అయితే ఎ నర్జీ అసిస్టెంట్ బదిలీలను గ్రామ సచివాలయం గైలెన్స్ ప్రకారం కాకుండా విద్యుత్ శాఖ బ దిలీల నియమ నిబంధన ప్రకారమే బదిలీలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలె క్టర్లకు,అన్ని జిల్లాల విద్యుత్ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్లకు వినతిపత్రం ఇవ్వడంతో ప్ర భుత్వం స్పందించి గ్రామ సచివాలయం నిబంధన ప్రకారం బదిలీలు చేయాలని ఇచ్చిన నోటిస్ ను రద్దు చేసిందని గుర్తుచేశారు.ఎనర్జీ అసిస్టెంట్ బదిలీలని విద్యుత్ శాఖ నిబం ధన ప్రకారం బదిలీలు చేపట్టాలని వారి డిమాండ్ చేశారు.ఏ సమస్యలైన పరిష్కారం కా వాలంటే పోరాటాలే ఏకైక మార్గమని వారు గుర్తుచేశారు.ఎనర్జీ అసిస్టెంట్ బదిలీల గైడ్ లె న్స్ పోరాట ఫలితంగానే రద్దయిందని చెప్పారు.కావున ఉద్యోగులు,కార్మికరంగం తమ హక్కులు సాధించుకోవాలంటే సిఐటియు పోరాటాలు,ఉద్యమాలను గుర్తించాలని వారు కోరారు.
Comments
Post a Comment