కలుషిత నీటిని అరికట్టాలి..ఫిల్టర్ నీటిని ప్రజలకు అందించాలి...సిపిఎం...
కలుషిత నీటిని అరికట్టాలిఫిల్టర్ నీటిని ప్రజలకు అందించాలిసిపిఎం
కర్నూలు కార్పోరేషన్ పరిధి,43వ వార్డు,ఇందిరాగాంధీ నగర్ లో త్రాగునీటి కులాయిల లో కలుషితమైన శుద్ధిచేయని వండ్రుతో కూడిన నీరు రావడంతో ప్రజలు ఆందోళనకు గు రవుతున్నారని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ టి.రాముడు అన్నారు.ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ అనేకసార్లు కొళాయిలలో శుద్ధి చేసిన త్రాగునీటికి బదులు కలుషితమైన ఒండ్రు నీరు తరచూ వస్తున్నా కార్పొరేషన్ అధి కారులు,ప్రజా ప్రతినిధులకుగాని ఏమాత్రం పట్టడం లేదన్నారు.
ప్రజలు ఈ నీరు త్రాగి విరోచనాలు,వాంతులు,జ్వరం,జలుబు,తదితర అనారోగ్యాలకు గు రవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నగర పాలక సంస్థ కమిషనర్ ఈ విషయాన్ని సీరి యస్ గా తీసుకొని ప్రజలను అనారోగ్యాల నుండి కాపాడాలని శుద్ధి చేసిన ఫిల్టర్ చేసిన త్రాగునీటిని కులాయిల ద్వారా ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు.అలాగే ఫిల్టర్ బె డ్ లో పనిచేస్తున్న కార్మికులు గత మూడు నెలలుగా సమ్మె చేస్తున్న పట్టించుకోవడం లేద ని,వెంటనే కార్మికుల సమస్యను పరిష్కరించి ప్రజలకు త్రాగునీరు అందించే విషయంలో అశ్రద్ధ చేయకుండా కలెక్టర్,ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.లేనిపక్షంలో ప్రజలను సమీకరించి ఆందోళన చేపట్టవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.ఈ కార్య క్రమంలో స్థానిక వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Comments
Post a Comment