ముగిసిన సచివాలయ కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్...ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక సంస్థ కమిషనర్...
ముగిసిన సచివాలయ కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక సంస్థ కమిషనర్
ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.ర వీంద్ర బాబు అధ్వర్యంలో రెండు రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహించారు.తొలి రోజు అ డ్మినిస్ట్రేటివ్,వెల్ఫేర్,ఎడ్యుకేషన్,శానిటేషన్ కార్యదర్శులకు,రెండో రోజు ప్లానింగ్,అమిని టీస్ కార్యదర్శులకు కౌన్సెలింగ్ చేపట్టారు.జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 308 సచి వాలయాలు ఉండగా,శనివారం 864మందికి,ఆదివారం ప్లానింగ్ 155,అమినిటీస్ 170మందికి కౌన్సిల్ పూర్తి చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీల ప్రక్రియ చేపట్టామని,ఒకేచోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి ప్రస్తుత వార్డు,సొంత వార్డు మినహా ఇతర వార్డులను ఎంపిక చేసుకు నేందుకు అవకాశం కల్పించామన్నారు.అభ్యర్థనలను ప్రభుత్వానికి పంపడం జరుగుతుం దని కమిషనర్ వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ,డిప్యూటీ క మిషనర్ సతీష్ కుమార్ రెడ్డి,గూడూరు కమిషనర్ రమేష్ బాబు,సిటి ప్లానర్ ప్రదీప్ కు మార్,ఇంచార్జీ ఎస్ ఈ శేషసాయి,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment