రాహుల్గాంధీపై అమిత్ షా తీవ్ర విమర్శలు...
రాహుల్గాంధీపై అమిత్ షా తీవ్ర విమర్శలు
VS9TV న్యూస్,నిజామాబాద్ :
రక్షణ వ్యవహారాల్లో రాజకీయం చేయడం హానికరం అని పేర్కొంటూ కేంద్ర హోంమంత్రి అమిత్షా,కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ఆపరేషన్ సిం ధూర్’ విషయంలో రాహుల్ అడుగుతున్న ఆధారాలపై ఆయన స్పందిస్తూ,"పాకిస్తాన్ గ డ్డపైకి వెళ్లి బుద్ధి చెప్పాం...ఇంకా ఏ ఆధారాలు కావాలి?" అని ప్రశ్నించారు.అమిత్షా మాట్లాడుతూ "ఆపరేషన్ సింధూర్ దేశ భద్రతను పరిరక్షించడానికి చేపట్టిన సాహసో పేతమైన చర్య.కానీ రాహుల్గాంధీ మాత్రం పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఆయన నోట పాకిస్తాన్ మాట వినిపిస్తోంది.దేశ భద్రతపై రాజకీయం చేయడం సరికా దు," అన్నారు.
ప్రధాన వ్యాఖ్యలు :
ఆపరేషన్ సింధూర్ అనేది భారత సైన్యం, భద్రతా దళాల కర్తవ్యనిరతిని చాటిచెప్పే మిష న్ అని పేర్కొన్నారు."రాహుల్ గాంధీ ఆధారాలు అడగడం అంటే...భారత సైన్యంపై అను మానం వ్యక్తం చేయడమే" అని వ్యాఖ్యానించారు."దేశ భద్రత కోసం పాక్ గడ్డపైకి వెళ్లి బుద్ధి చెప్పాం.ఈ ధైర్యాన్ని కాంగ్రెస్ చూపలేకపోయింది" అని బీజేపీ నాయకుడు వ్యా ఖ్యానించారు.అమిత్షా తాజా వ్యాఖ్యలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముందు రా జకీయ వేడి పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.ప్రస్తుతం దేశ భద్రత, అంతర్జాతీయ సంబంధాలు,రాజకీయ విమర్శల నేపథ్యంలో ‘ఆపరేషన్ సింధూర్’ చర్చ నీయాంశంగా మారింది.నిజామాబాద్ సభలో అమిత్షా స్పష్టమైన రాజకీయ సంకేతాలు పంపినట్టు భావిస్తున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ను దేశ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తోం దన్న బీజేపీ ఆరోపణలను ఆయన మళ్లీ పునరుద్ఘాటించారు.
Comments
Post a Comment