స్కేటింగ్ లో ప్రతిభను చాటాలి
స్కేటింగ్ లో ప్రతిభను చాటాలి
VS9TV న్యూస్,కర్నూల్ స్పోర్ట్స్ :
ఒలింపిక్ డే ను పురస్కరించుకుని గురువారం సాయంత్రం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడి యంలోని స్కేటింగ్ రింక్ లో జరిగిన స్కేటింగ్ పోటీలకు అతిధి మానవతా స్వచ్ఛంద సం స్థ సభ్యులు యాని ప్రతాప్,మనవత అధ్యక్షులు దీప,పోటీల కన్వీనర్ డా.రుద్రారెడ్డి,స్కే టింగ్ జాయింట్ సెక్రటరీ పునీత చౌదరి,విజయ కుమారి హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు జండా ఊపి పోటీలను ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ఆటవిడుపుగా స్కేటింగ్ నేర్చుకొని పోటీల వరకు చేరుకున్న క్రీడాకారులను అభినందించరూ,స్కేటింగ్ లో పోటీ తత్వం పెరిగి చక్కటి క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షిచారు.స్కేటింగ్ తో మంచి ఆరాగ్యమే గాక మానసిక ఉల్లాసం పంపాండుతుందని అన్నారు.ఈ కార్యక్రమం లో ఒలింపిక్ నిర్వాహక కార్యదర్శి పి.సునిల్ కుమార్,స్కేటింగ్ కార్యదర్శి అబూబాకర్ పా ల్గొన్నారు.
Comments
Post a Comment