కార్పొరేట్,ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టడంలో విద్యాశాఖ అధికారులు వైఫల్యం...ఎస్ఎఫ్ఐ...
కార్పొరేట్,ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టడంలో విద్యాశాఖ అధికారులు వైఫల్యం...ఎస్ఎఫ్ఐ
కర్నూలు నగరంలో ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ప్రభుత్వం నిబంధన తుంగలో తొక్కి పుస్తకాల వ్యాపారం,అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ ఆధ్వ ర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కర్నూలు నగ ర అధ్యక్షులు అబూబకర్ మాట్లాడుతూ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల విచ్చలవిడిగా ప్రభు త్వాన్ని ఉద్దేశించిన ఫీజుల కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు.పాఠశాల లోనే పుస్తకాల మాఫియాను చేస్తున్నారన్నారు.కార్పొరేట్,ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీపై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం వ్యక్తం చేసిన విద్యాశాఖ అధికారులకు పలుమార్లు తెలియజేసిన నిమ్మకు నీరెత్తినట్లు ఎటువంటి చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ చైతన్య పాఠశాల సెల్లార్లో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ పాఠశాలను నడుపుతున్నారు.ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం పట్టిం చుకోకుండా ఉల్లంఘించిన కార్పొరేట్,ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు.లేనిపక్షంలో కూటమి ప్రభుత్వానికి,కార్పొరేట్,ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్ర భుత్వ అధికారులు అమ్ముడుపోయారని భావించాల్సి వస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు ఆర్యన్,నగర సహాయ కార్యదర్శి పృథ్వి,నగర కమిటీ సభ్యులు తదిత రులు పాల్గొన్నారు.
Comments
Post a Comment