పారదర్శకంగా గ్రామ,వార్డు సచివాలయ మహిళా పోలీసులకు బదిలీల ప్రక్రియ... కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్...
పారదర్శకంగా గ్రామ,వార్డు సచివాలయమహిళా పోలీసులకు బదిలీల ప్రక్రియ కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో సాధారణ బదిలీల్లో భాగంగా శనివారం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు బదిలీల ప్ర క్రియను శనివారం పారదర్శకంగా చేపట్టినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలి పారు.ఈ కౌన్సిలింగ్ కు మొత్తం 839మంది బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియకు హాజరయ్యా రు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహిళా పోలీసులతో మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్దే శించిన నిబంధనల మేరకు ర్యాంకింగ్ ప్రకారం పిలిచి పారదర్శకంగా గ్రామ,వార్డు మహి ళా పోలీసుల బదిలీలు చేపట్టామన్నారు.బదిలీలు కోరుకునే ఉద్యోగిని తన స్వగ్రామం/వా ర్డు ఉండే సచివాలయం మినహా ఇతర సచివాలయాలను కోరుకోవాలని,ఖాళీల వారీగా ఉన్న సచివాలయాల ఆప్షన్లను కంప్యూటర్ డిస్ ప్లే తెరపై ఉంచామని,అందులో మీకు నచ్చిన సచివాలయాన్ని ఎంపిక చేసుకొనే అవకాశం కల్పించామన్నారు.
విజువల్ ఛాలెంజ్ (దృష్టి లోపం,అంధత్వం),మెంటల్లీ డిసెబుల్డ్ (మేధో వైకల్యం),ట్రైబ్స్, దివ్యాంగులు,మెడికల్, స్పౌష్,జనరల్ తదితరులను వారి సమస్యల ప్రాతిపదికను పరిగణ నలోకి తీసుకొని ధ్రువీకరణ పత్రాలను వైద్యుల పర్యవేక్షణలో నిజ,నిర్ధారణ చేసుకుని పార దర్శకంగా బదిలీలు చేపట్టామన్నారు.
అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా మాట్లాడుతూ...బదిలీల ప్రక్రియ ముగిసిన తర్వాత జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ట్రాన్స్ఫర్ ప్రోసిడింగ్స్ విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా,ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమో హన్,మహిళా పియస్ డిఎస్పీ శ్రీనివాసాచారి,పోలీసు వేల్పేర్ డాక్టర్ స్రవంతి,సిఐలు తే జమూర్తి,ఆధిలక్ష్మీ,విజయలక్ష్మీ ,ఎస్సైలు,ఆర్ ఎస్సైలు,డిపిఓ సిబ్బంది,పోలీసులు పాల్గొన్నా రు.
Comments
Post a Comment