దొరికిన వజ్రంను ప్రసిద్ధ ఆంజనేయస్వామికి అప్పగించిన ఆకాశరామన్న భక్తుడు...
దొరికిన వజ్రంను ప్రసిద్ధ ఆంజనేయస్వామికి అప్పగించినఆకాశరామన్న భక్తుడు
VS9TV న్యూస్,రాజంపేట :
అన్నమయ్య జిల్లా,రాజంపేట పట్ట ణంలోని ప్రసిద్ధ ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కా ర్యక్రమాన్ని దేవాదాయ శాఖ అ ధికారులు నిర్వహించారు.ఈ కా ర్యక్రమంలో ఆలయ హుండీ నుం చి 1.39.6క్యారెట్ల ముడి వజ్రం బయటపడింది.అంతేకాకుండా వ జ్రంతో పాటు ఒక ఉత్తరం కూడా లభించింది.ఆ ఉత్తరంలో దాత తనకు ఈ వజ్రం దొరికిందని,అది నిజమైనదని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే స్వామి వారికి సమర్పిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాదు,ఈ వజ్రాన్ని స్వామివారి అలంకరణ, ఆభరణాల తయారీకి వినియోగించాలని కోరారు.ఈ సమాచారం అందుకున్న దేవాదా య శాఖ తనిఖీ అధికారి జనార్దన్,కార్య నిర్వహణాధికారి కొండారెడ్డిల సమక్షంలో వజ్రా న్ని ఆలయ ప్రధాన అర్చకుడు రవిస్వామి వద్దకు అప్పగించారు.ఈ సందర్భంగా అధికారులు దాత చేసిన ఆత్మీయ సమర్పణను ప్రశంసించారు. హుండీ లెక్కింపు పూర్తయిన అనంత రం ఈ వివరాలను అధికారికంగా ధృవీకరిం చారు.ఆలయానికి ఈ రకమైన సమర్పణలు స్వామివారి పట్ల భక్తుల విశ్వాసానికి దృఢత చేకూరుస్తున్నాయని దేవాదాయ శాఖ అధి కారులు వ్యాఖ్యానించారు.కాగా 1.39.6క్యారెట్ల ముడి వజ్రం విలువ..దాని నాణ్యత ఆ ధారంగా,సుమారు రూ.70లక్షలు నుండి రూ.2 కోట్లు ఉండే అవకాశం ఉందని వజ్రాల వ్యాపారులు చెబుతున్నారు.
Comments
Post a Comment