దేవాలయాల భూములు గోరంత కూడా అన్యాక్రాంతం కానివ్వను... అభిరుచి మధు, నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు...

దేవాలయాల భూములు గోరంత కూడా 
అన్యాక్రాంతం కానివ్వను
ప్రధమ నంది దేవాలయం భూములు అక్రమిస్తే ఖబర్దార్
కబ్జాదారుల వెనుక పెద్దవారు,రాజకీయ శక్తులు ఉన్నా భయపడేది లేదు
దేవాలయం రక్షణ గోడ నిర్మాణానికి 
నా వంతు ప్రయత్నం చేస్తాను
దేవాలయ సమస్యను ముఖ్యమంత్రి, 
దేవాదాయ శాఖ,బిజెపి పెద్దల దృష్టికి తీసుకెళతా
అభిరుచి మధు,నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు

VS9TV న్యూస్,నంద్యాల ప్రతినిధి :

నంద్యాల జిల్లాలో దేవాలయాల భూములు గోరంత కూడా అన్యాక్రాంతం కానివ్వనని నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు అభిరుచి మధు కబ్జా దారులకు ఘాటుగా హెచ్చరించా రు.ప్రథమ నంది దేవాలయం భూముల నుంచి అనుమతులు లేకుండా కొందరు స్వార్థ ప్ర యోజనం కోసం రస్తా నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచార సాధనాల్లో వచ్చిన వి షయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు అభిరుచి మధు ఆది వారం ప్రథమ నంది దేవాలయం వద్దకు వెళ్లి ఈఓ రామానుజంతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.అంతకు ముందు దేవాలయంలో మహా పరమశివుడికి అభిషేకం చేసి స్వా మి వారి ఆశీస్సులు తీసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో దేవాలయాలకు సంబంధించిన భూములు కోట్లు విలువచేస్తాయని అన్నారు.నంద్యాల జిల్లా కావడంతో కబ్జా దారుల క న్ను దేవాలయాల భూములపై పడిందన్నారు. నంద్యాల జిల్లాలో దేవాలయాల భూములు గోరంత అన్యాక్రాంతం కానివ్వను అని కబ్జాదారుల తనదైన శైలిలో ఘాటుగా హెచ్చరిం చారు.ప్రచార మాధ్యమాల్లో శనివారం ప్రథమ నంది దేవస్థానంకు చెందిన భూమి నుంచి అనుమతి లేకుండా కొందరు స్వార్థపరులు రస్తా నిర్మాణం చేపడుతున్నారని సమాచారం వచ్చిందన్నారు.ఇందుకోసం ప్రథమ నంది దేవాలయంకు ఈఓ రామానుజంతో కలిసి పరి శీలించానని అని చెప్పారు.నవనందులలో ప్రదమానంది దేవాలయం ఎంతో చారిత్రాత్మ కమైన దేవాలయం అన్నారు.నవ నందులు కొలువైన ప్రాంతం కావడంతో నంద్యాలకు ఈ పేరు వచ్చిందని పేర్కొన్నారు.దేవాలయంకు భూమి ఎక్కువగా ఉండడంతో కొందరు స్వా ర్థపరులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అర్ధరాత్రి జేసిబిలు తీసుకొచ్చి రాస్తా ఏర్పాటుచే సేందుకు ప్రయత్నం చేయడం ఈఓ పోలీసులకు పిర్యాదు చేయడంతో వారు రంగప్రవే శం చేయడంతో కబ్జా దారులు వెళ్ళి పోయారన్నారు.దేవాలయం సంబంధించి భూమిని 1946లో శంకరమ్మ అనే మహిళా కొందరికి రాస్తా హక్కులు రాసిచ్చినట్టు కొందరు దొం గ పత్రాలు సృష్టించారని అన్నారు.ఇరువర్గాలు కోర్టుకు వెళ్లడంతో కోర్టులో 1990లో రా స్తా హక్కులు చెల్లవని తీర్పు ఇచ్చారని అన్నారు.న్యాయస్థానం తీర్పును గౌరవించకుండా కొందరు కబ్జాదారులు రాస్తా ఏర్పాటుకు ప్రయత్నం చేశారన్నారు.ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి,దేవాదాయ శాఖ,జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకొని వెళతానన్నా రు.కుట్రదారుల వెనుక పెద్ద మనుషులు,రాజకీయ శక్తులు,ఎంతటి పెద్దవారు ఉన్నా బయ టపడే పరిస్తితి లేదని హిందూ దేవాలయాల భూములు కాపాడుకుంటామని పేర్కొన్నా రు.రాస్తా హక్కులు ఎవరికైనా ఉంటే మున్సిపల్, రెవెన్యూ,దేవాదయ శాఖ అధికారుల నుంచి అనుమతి ఉంటే చూపించాలన్నారు.గతంలో దేవాలయం చుట్టూ రక్షణ గోడ ని ర్మాణానికి నిధులు మంజూరైన,ప్రస్తుతం ఆగిపోవడం విశేషం అన్నారు.దేవాలయం చు ట్టూ రక్షణ గోడ నిర్మాణ పనులు జరిగే విధంగా ముఖ్యమంత్రి,దేవాదాయ శాఖ,బిజెపి పె ద్దల దృష్టికి తీసుకొని వెళ్ళి రక్షణ గోడ నిర్మించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానన్నా రు.నంద్యాల జిల్లాలో ఎక్కడైనా దేవాలయాల భూములు ఆక్రమించాలని చూస్తే బిజెపి శ్రే ణులు,హిందూ సంఘాలు సంయుక్తంగా పోరాటాలు చేయడానికి సిద్ధమన్నారు.జిల్లాలో దేవాలయాల భూముల జోలికి వస్తె ఎంత పెద్దవారైనా,రాజకీయ శక్తులకైనా న్యాయప రంగా పోరాడి హిందూ దేవాలయాల భూములు కాపాడుకుంటామని పేర్కొన్నారు.జిల్లా లో దేవాలయాల భూములు ఆక్రమణలకు గురైతే మా దృష్టికి తీసుకొని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్నేహా వృద్ధాశ్రమం నిర్వాహకులు స్వామిరెడ్డి,బాలన్న తదితరులు పా ల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....