అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి... నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు ఆదేశాలు...
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలికేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలినగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు ఆదేశాలు
కర్నూలు నగరంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధులను సమర్థవంతంగా ఉపయోగించు కుంటూ,అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు.కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం నేషనల్ క్లీన్ ఎయి ర్ ప్రోగ్రామ్ (యన్క్యాప్) పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని,జాప్యం చేయకుండా సకాలం లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులకు సూచించారు. శుక్రవా రం ఆయన నగరంలో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. యన్క్యాప్ కార్యక్రమం ద్వారా సుంకేసుల రోడ్డు,మద్దూర్ నగర్,బి.క్యాంపు పోస్ట్ ఆఫీస్ నుండి సి. క్యాంపు టిటిడి కళ్యాణ మండపం వరకు, బి.క్యాంపు విజ్ఞన్ మందిర్ ప్రాంతాల్లో రహ దారి ఇరువైపులా ఖాళీ ప్రదేశాలపై రహదారుల నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలిం చారు.గాయత్రీ ఎస్టేట్ కూడలి కుదింపు,కిమ్స్ ఆస్పత్రి రహదారిలో విభాగినిల్లో మొక్కలు నాటుట,సుద్దవాగు పూడికతీత పనులు పూర్తి చేయవల్సిన పనులను కమిషనర్ పరిశీలిం చి,అధికారులకు పలు సూచనలు చేశారు.అదేవిధంగా పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పను లను మెరుగుపరచడానికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డి ప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి,ఇంచార్జీ ఎస్.ఈ శేషసాయి,ప్రజారోగ్య అధికారి డాక్టర్ వి శ్వేశ్వర్ రెడ్డి,డిఈఈ గిరిరాజ్,మనోహర్ రెడ్డి,నరేష్, బిల్డింగ్ సూపర్వైజర్ అంజాద్ బాష, ట్రైనీ ఏఈలు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment