నేరాల కట్టడికి గట్టిగా పని చేయాలి... మహిళలపై జరిగే నేరాల నివారణకు గట్టి చర్యలు చేపట్టాలి...జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్...
నేర నియంత్రణ,ప్రజలకు ఉత్తమ సేవలందించడమేలక్ష్యంగా పని చేయాలిఅత్యాధునిక సాంకేతికతను వినియోగించాలినేరాల కట్టడికి గట్టిగా పని చేయాలి జిల్లా వ్యాప్తంగా రాత్రి వేళల్లో గస్తీని పటిష్ట చేయాలిమహిళలపై జరిగే నేరాల నివారణకు గట్టి చర్యలు చేపట్టాలిజిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
శాంతిభద్రతల పరిరక్షణ,నేర నియంత్రణ,ప్రజలకు ఉత్తమ సేవలందించడమే లక్ష్యంగా ప ని చేయాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.శుక్రవారం జిల్లా పోలీసు కార్యాల యంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డిఎస్పీలు,సిఐలు,ఎస్సైలతో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.పోలీసు అధికారులతో చ ర్చించారు.కర్నూలు,పత్తికొండ,ఆదోని,ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లలో ఉన్న పెండింగ్ కే సుల గురించి జిల్లా ఎస్పీ సమీక్షించి ఆరా తీశారు.పోలీసుస్టేషన్ల వారీగా కేసుల పెండింగ్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పలు సలహాలు,సూచనలు చేశారు.ఈ సంధ ర్బంగా ఎస్పీ మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి నేరాల కట్టడికి గట్టి గా పని చేయాలన్నారు.పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించే విధంగా అన్ని స్ధాయిల అధికా రులు కృషి చేయాలన్నారు.పెండింగ్ కేసులలో ముద్దాయిల అరెస్టు గురించి ఆరా తీశారు. ప్రాధాన్యత గల కేసులలో ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా భాదితులకు న్యాయం జరి గే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లా వ్యాప్తంగా రాత్రి గస్తీలు బాగా చేయాలన్నా రు.(ఎంఎస్ సిడి)మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ తో రాత్రి గస్తీలలో అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల వేలి ముద్రలను సేకరించి,వాటిని నేర రికార్డులతో సరిపోల్చి నేరగాళ్ళ ను పట్టుకోవాలన్నారు.
నేర పరిశోధనలలో నిందితులను గుర్తించడంలో వేలి ముద్రల విశ్లేషణ యొక్క ప్రాముఖ్య త చాలా ఉందన్నారు.సిసియస్ పోలీసులు బాగా పని చేయాలన్నారు.దొంగతనాల ని వారణకు,ప్రాపర్టీల రీకవరికి కృషి చేయాలన్నారు.బేసిక్ పోలీసింగ్ లో భాగంగా పోలీసు అధికారులు పాటించాల్సిన విధులు,నైతిక ప్రమాణాలు,రోల్ కాల్స్,చట్టాన్ని అమలు చే యడంలో ప్రజలకు న్యాయం చేయాలన్నారు.డయల్ 100 బాగా పని చేయాలన్నారు. పోక్సో కేసులలో నివేదికలు త్వరగా సిద్దం చేయాలన్నారు.రోడ్డు ప్రమాదాలు తగ్గించాల న్నారు.రోడ్డు ప్రమాదాల మలుపులు,ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అడ్డుగా ఉన్న కంప చెట్లను తొలగించాలన్నారు.రేడియం స్టిక్కర్స్,బారికేడ్స్,జిగ్ జాగ్ డ్రమ్స్,స్పీడ్ బ్రే కర్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టా లన్నారు.మిస్సింగ్ కేసులు,పోక్సో, మహిళలపై జరిగే నేరాల నివారణపై ప్రత్యేక శ్రధ్ధ వ హించాలన్నారు.ఇటువంటి విషయాల పట్ల పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండే విధంగా పోలీసు అధికారులు బ్రీఫింగ్ చేయాలన్నారు.సచివాలయ మహిళా పోలీసుల విధుల గు రించి ఆరా తీశారు.విధుల పట్ల వారి సేవలను సద్వినియోగం చేసుకునేవిధంగా చూడాల న్నారు.అనంతరం గత నెలలో వివిధ కేసులలో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులు, పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ నేర సమీక్షా సమావే శంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా,లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు,డిఎస్పీ లు బాబు ప్రసాద్,వెంకట్రామయ్య,ఉపేంద్ర బాబు,హేమలత,ఏఆర్ డిఎస్పి భాస్కర్ రావు, సిఐలు,ఎస్సైలు పాల్గొన్నారు.
Comments
Post a Comment