నవ వధువుపై అత్యాచారయత్నం...
నవ వధువుపై అత్యాచారయత్నం
VS9TV న్యూస్,పల్నాడు :
ఆంధ్రప్రదేశ్,పల్నాడు జిల్లా,అచ్చంపేట, అత్తలూరులో ఇరవై రోజుల క్రితం వివాహమైన న వ వధువుపై అత్యాచారయత్నంకు పాల్పడిన ఘటన జరిగింది.వివరాలు ఇలా ఉన్నా యి...భర్త ఇంట్లోలేని సమయంలో ముగ్గురు వ్యక్తులు వివాహితను వేధిస్తున్న కేసు నమో దైంది.అత్యాచారయత్నం చేస్తున్న సమయంలో వీడియో రికార్డింగ్ చేస్తుండగా స్థానిక యువకుడు గుర్తించి అడ్డుకున్నాడు.దీంతో నిందుతులు అక్కడినుంచి పారిపోగా ఈ ఘ టనతో తీవ్ర మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.ప్రస్తుతం జిజి హెచ్ లో చికిత్స పొందుతోంది.భర్త,కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అమరావతి పోలీసు లు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పరారీలోవున్న నిందితులకోసం గాలిస్తున్నట్లు తెలిపారు.ఇదిలా ఉంటే...శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.డబ్బుల కోసం సొంత తల్లి,దండ్రులే మూడేళ్ల కుమార్తెను విక్రయించారు.ఉపాధి కోసం కేరళకు వెళ్లిన రవీంద్ర నాయక్,శ్రీవాణి దంపతులు రూ.10లక్షలకు విక్రయించారు.ఈ విషయం తెలుసుకున్న బంధువులు విషయం అడగడంతో వారు వివాదానికి దిగారు.పోలీసులు కేసు నమోదు చే సి దర్యాప్తు చేపట్టారు.
Comments
Post a Comment