వాణిజ్యేతర వాహనదారులకు కేంద్రం శుభవార్త...మూడు వేలకు వార్షిక టోల్పాస్...
వాణిజ్యేతర వాహనదారులకు కేంద్రం శుభవార్తమూడు వేలకు వార్షిక టోల్పాస్హైవేలపై 200 ట్రిప్పులుఒక్కో టోల్గేట్ ఒక్కో ట్రిప్పుఆగస్టు,15 నుంచి అమల్లోకి
జాతీయ రహదారులు(ఎన్హెచ్),జాతీయ ఎక్స్ప్రెస్వే(ఎన్ఈ)లపై ప్రయాణించే వాణిజ్యే తర ప్రైవేటు వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.వీరి కోసం ఆగస్టు, 15 నుంచి మూడు వేల వార్షిక ఫాస్టాగ్ టోల్పాస్ విధానాన్ని ప్రవేశపెడుతోంది.దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది.మూడు వేలతో ఫాస్టాగ్ టోల్పాస్ తీ సుకునే కార్లు,జీపులు,వ్యాన్ల యజమానులు ఏడాదిపాటుగానీ,200ట్రిప్పుల వరకుగానీ జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు.కొత్త విధానం వ్యక్తిగత కార్లు, జీపులు,వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది.వాణిజ్య వాహనాలకు చెల్లుబాటు కాదు.200ట్రిప్పులు పూర్తయ్యాక మళ్లీ మూడు వేలతో యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇలా ఏడాదిలో ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు.ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్నవారు మళ్లీ కొత్త ఫాస్టాగ్ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.పాత ఫాస్టాగ్లోనే టోల్పాస్ను యాక్టివేట్ చేసుకోవచ్చు.ఒక్కో టోల్ గేట్ ను ఒక్కో ట్రిప్పుగా లెక్కిస్తారు.హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేవారు నాలుగు టో ల్గేట్లను దాటాల్సి ఉంటుంది.అంటే వారు నాలుగు ట్రిప్పులను పూర్తి చేసినట్లుగా లెక్కి స్తారు.తిరిగి వస్తే మరో నాలుగు ట్రిప్పులుగా లెక్కిస్తారు.అంటే హైదరాబాద్ నుంచి విజయ వాడ వెళ్లి రావడానికి ఎనిమిది ట్రిప్పులు అవుతాయి.ఈ పాస్లను ఛాసిస్ నంబరు ఆధా రంగా కాకుండా...వాహన రిజిస్ట్రేషన్ నంబరు ద్వారానే జారీ చేస్తారు.వార్షిక పాస్ తీసు కోవడం తప్పనిసరేమీ కాదు.తక్కువ ట్రిప్పులు తిరిగేవారు,ఒకేసారి మూడు వేలు చెల్లించ డానికి ఇష్టపడనివారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫాస్టాగ్ విధానాన్ని కొనసాగిస్తూ టోల్ గేట్లలో వసూలు చేసే ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.దేశవ్యాప్తంగా 1,063 టోల్ప్లాజాలు న్నాయి.వాటి సంఖ్య ఏపీలో 72గా,తెలంగాణలో 36గా ఉంది. 2024,డిసెంబరు,1 నా టికి దేశంలో 10.1 కోట్ల ఫాస్టాగ్లను వాహనదారులు తీసుకున్నారు.ఫాస్టాగ్ల ద్వారా జాతీయ రహదారులపై రోజుకు సగటున రూ.200 కోట్ల ఆదాయం వస్తోంది.టోల్ ప్లా జాల ద్వారా వెళ్లే వాహనాల్లో 53శాతం కార్లు, జీపులు,వ్యాన్లు ఉంటున్నాయి.సగటున ఏ డు వేల లాభం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై తక్కువ ఖర్చుతో రాకపోకలు సా గించడానికి వార్షిక టోల్పాస్ ఉపయోగపడుతుందని రోడ్డు రవాణా,జాతీయ రహదా రులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.కొత్త పాస్ల యాక్టివేషన్,రెన్యువల్ కోసం రాజ్ మార్గ్యాత్ర యాప్,ఎన్హెచ్ఏఐ, ఎంవోఆర్టీహెచ్ వెబ్సైట్లలో ప్రత్యేక లింక్లను త్వర లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వారు విడుదల చేసిన ప్రకటనలో ఆయన వెల్లడిం చారు.''60 కిలోమీటర్లలోపే రెండు టోల్ప్లాజాలు ఉన్నచోట్ల చాలాకాలంగా ఎదురవు తున్న సమస్యలను కొత్త పాస్ విధానం పరిష్కరిస్తుంది.వార్షిక టోల్పాస్లతో వాహనదా రులకు సగటున ఏడు వేల ప్రయోజనం కలుగుతుంది.ప్రస్తుతం ఒక్కో టోల్గేట్వద్ద రూ.50 నుంచి రూ.100కుపైగా టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు.వార్షిక పాస్తో ఒక్కో టోల్గేట్ దాటడానికి సగటున రూ.15 ఖర్చవుతుంది.ఇప్పుడున్న విధానం ప్రకారం...ఒ క్కో గేట్వద్ద సగటున కనీసం రూ.50చెల్లిస్తారనుకుంటే...200గేట్లు దాటడానికి రూ. 10వేలు చెల్లించాల్సి ఉంటుంది.వార్షిక పాస్తో ఇది మూడు వేలకు తగ్గుతుంది.దీనివల్ల వాహనదారులకు ఏటా సగటున ఏడు వేల ప్రయోజనం చేకూరుతుంది.రాష్ట్ర రహదారు లకు ఇది వర్తించదు.రాష్ట్ర ప్రభుత్వాలు,స్థానిక సంస్థల పరిధిలోకి వచ్చే ఎక్స్ప్రెస్వేలు,స్టేట్ హైవేల్లో ఈ వార్షిక ఫాస్టాగ్ సాధారణ ఫాస్టాగ్లా పని చేస్తుంది.ఆ ప్లాజాలో వసూలుచేసే సాధారణ మొత్తాన్ని అక్కడ చెల్లించాల్సి ఉంటుంది'' అని వివరించారు.
Comments
Post a Comment