మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలి...రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సులర్ ఆచార్య వి.వెంకట బసవరావు పిలుపు...
మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలిరాయలసీమ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సులర్ ఆచార్య వి.వెంకట బసవరావు పిలుపు
మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని రాయలసీమ విశ్వవిద్యాల య వైస్ ఛాన్సులర్ ఆచార్య వి.వెంకట బసవరావు పిలుపునిచ్చారు.వర్సిటీ వి.సి.కాన్ఫరె న్సు హాలులో గురువారం జరిగిన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్య క్రమానికి అయన హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆచార్య వి.వెంకట బసవరావు మాట్లా డుతూ మత్తుపదార్ధాల కారణంగా యువత నిర్వీర్యమౌతోందని ఆందోళన వ్యక్తం చేశా రు.రకరకాల ఆకర్షణలకులోనై బంగారంలాంటి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యు వతకు ఆయన హితవు పలికారు.రాయలసీమ యూనివర్సిటీ క్యాంపస్ లో డ్రగ్సుకు స్థా నంలేకుండా చూసుకోవలసిన బాధ్యత వర్సిటీ వర్గాలపై ఉందని అన్నారు.మాదక ద్రవ్యా ల వినియోగాన్ని అరికట్టడంతోపాటు తెలిసో,తెలియకో వాటికి బానిసలుగా మారినవారి కి సరైన చికిత్స అందించడం,సాధారణ స్థితికి చేరుకొనేలా చేయాలన్నారు.నషాముక్త్ భారత్ పేరుతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపు నిచ్చాయని తెలియజేశారు.మాదక ద్రవ్యాల నివారణకు వివిధ సంస్థలు చేస్తున్నకృషి అన న్య సామాన్యమని వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ కొనియాడారు.వర్సిటీ రిజి స్ట్రార్ డాక్టర్ బి. విజయ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ బాధ్యత కలిగిన పౌరులుగా మాదకద్రవ్యాలజోలికి పోకుండా ఉండటంతోపాటు వాటి బారిన పడినవారికి పునరావా స కేంద్రాలద్వారా సరైన చికిత్స అందేలా చూడటం ప్రతి ఒక్కరి కర్తవ్యమని సూచించా రు.వర్సిటీ సిడిసి డీన్ ఆచార్య పి.వి.సుందరానంద్ మాట్లాడుతూ దుర్వ్యసనం ఏదైనా మ నిషిని ఆర్ధికంగా,సామాజికంగా దిగజారుస్తుందని హెచ్చరించారు.
డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య ఆర్. భరత్ కుమార్ మాట్లాడుతూ యువ జనాభాతో కూడిన భారతదేశ యువత డ్రగ్స్ జోలికి పోకుండా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ నేప థ్యంలో మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండే విధంగా కృషిచేస్తామని వి.సి. అందరితో ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీని వర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఆచార్య వి.వెంకటబసవరావు జెండా ఊపి ప్రా రంభించారు.రాజవిహార్ నుండి కలెక్టరేట్ వరకు జరిగిన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్య క్రమంలో వివిధ విభాగాల అధ్యాపకులు,విద్యార్థినీ విద్యార్థులు,బోధనేతర సిబ్బంది పాల్గొ న్నారు.
Comments
Post a Comment