వైద్యులకు బ్యాట్మెంటన్ పోటీలు...
వైద్యులకు బ్యాట్మెంటన్ పోటీలు
VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :
రాయలసీమ పరిధిలోని వైద్యులకు డాక్టర్స్ డే సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బ్యాట్మెంటన్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా నిర్వహించారు. పోటీలకు కర్నూలు కిమ్స్ హాస్పిటల్ సేపూరి సునీల్,ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ ఎస్.వి.రామ్మోహన్ రెడ్డి,ప్రెసిడెంట్ రా మచంద్రనాయుడు హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రాయలసీమ పరిధిలోని మెన్స్ వైద్యులందరూ నేటి ఓపెన్ డబుల్స్ బ్యాట్మెం టన్ టోర్నమెంట్ లో పాల్గొని వారిలో ఉన్న ప్రతిభను చాటారు.వైద్యులకు క్రీడలను ఏర్పా టు చేయడానికి కిమ్స్ హాస్పిటల్ ఎల్లప్పుడు ముందు వరుసలో ఉంటుందని అన్నారు. ఈ క్రీడల వలన మానసిక ఉల్లాసానికి ఉత్సాహానికి దోహదపడుతుంది.వారి ఆరోగ్యం కొరకు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడంలో కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి ఆనందం గా ఉందన్నారు.ప్రజల ఆరోగ్యమే కాకుండా వైద్యులు తమ తమ ఆరోగ్యాలను కాపాడు కుంటూ ప్రజలకు సేవ చేయాలని సూచించారు.ఈ షటిల్ టోర్నమెంట్ లో మొదటి స్థాన విజేతలుగా డాక్టర్ వాసురెడ్డి అమర్నాథ్ రెడ్డి నిలిచి రోలింగ్ ట్రోఫీని గెలుచుకున్నారు. ద్వి తీయ స్థానంలో డాక్టర్ ఎడ్విన్ డాక్టర్ భరత,తృతీయ బహుమతి డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి,డాక్టర్ అనిల్ నిలిచారు.వైద్య విద్యార్థుల కేటగిరిలో మొదటి విజేతలుగా డాక్టర్ భర త్ డాక్టర్ భార్గవ్ నిలిచారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రాయలసీమ పరిధిలో ని వైద్యులు కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment