మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు...ఐదు వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు...
మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులుఐదు వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు
పెద్దపల్లి,జిల్లా కేంద్రంలో ఆర్టీఓ కార్యాలయంలో గురువారం జరిగిన ఏసీబీ దాడులు మర వకముందే...మరోసారి పెద్దపల్లి జిల్లా,సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి.వినోద్ విజయ్ బాధితుడి వద్దనుండి రూ.5000 లం చం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.వివరాలు ఇలా ఉన్నాయి...సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ఆర్నకొండ ప్రసాద్ తన ఇంటి నంబర్ కోసం గత సంవత్సర కాలం నుండి మున్సి పల్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ... అధికారులు పట్టించుకోకపోగా,గత 15 రోజుల నుండి మున్సిపల్ ఉద్యోగులైన వినోద్,విజయ్ లను కలవగా రూ.10వేలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు అవినీతి నిరోధకశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ముందస్తు ఒప్పందం ప్రకారం రూ.5000 లంచం ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధి కారులు వలపన్ని పట్టుకున్నారు.
Comments
Post a Comment