గ్రామీణ అభివృద్ధిని మరిచిన కూటమి ప్రభుత్వం...రాఘవేంద్ర,డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు...
గ్రామీణ అభివృద్ధిని మరిచిన కూటమి ప్రభుత్వంరాఘవేంద్ర,డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు
కూటమి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిని మరిచిపోయిందని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రా ఘవేంద్ర విమర్శించారు.ఆదివారం కర్నూలు మండలం డివైఎఫ్ఐ జనరల్ బాడీ సమావే శం డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో మండల అధ్యక్షులు సురేష్ అధ్యక్షతన జరిగింది. స మావేశానికి హాజరైన రాఘవేంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు.ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకొని సంబ రాలు చేసుకుంది తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోలేదని అన్నారు.కర్నూలు మండలం లో అనేక గ్రామాలు ఇబ్బందులతో సతమతమవుతున్నాయని అన్నారు.కర్నూలు జిల్లా కేం ద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఉల్చాల గ్రామంలో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడు తున్నారని చెప్పారు.ఆర్.కె.దుద్యాల గ్రామానికి నేటికీ రోడ్డు సౌకర్యం లేదన్నారు.అనేక గ్రామాలలో డ్రైనేజీ సౌకర్యం లేక లక్షల రూపాయలు పెట్టి వేసిన సీసీ రోడ్లపై మురుగునీరు పారుతుందని ఆవేదన చెందారు.అనేక గ్రామాలలో రోడ్ల నిర్మాణం లేక మురికి కుంట ల్లాగా రోడ్ల పరిస్థితి ఉందన్నారు.నేటికీ నందనపల్లె,భూపాల్ నగర్,నూతన పల్లె ప్రజలు చెరువు గట్టున మనిషి చస్తే పూడ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.కనీసం వీధి లైట్లు కాలి పోతే వేసే పరిస్థితి కూడా లేని దుర్మార్గమైన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే యువతకిచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని తెలియజేశారు. ఇలా అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సంవత్సర కాలం సందర్భంగా అనేక సమస్యలు పరిష్కారం చేశాం. ఇచ్చిన హామీలు అమలు చేశామని సంబరాలు ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు.వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం చేయా లని,చేయకపోతే పెద్దఎత్తున డివైఎఫ్ఐ యువజన సంఘం ఆందోళనకు దిగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ సమావేశంలో మండల కార్యదర్శి ప్రకాష్,మండల నాయ కులు హరి,కిషన్ రెడ్డి,రాజు,దివాకర్,గోవర్ధన్,ప్రశాంత్,రోహిత్,రఘువరన్,వివిధ గ్రామా ల యువకులు పాల్గొన్నారు.
Comments
Post a Comment