“బాబు మ్యారిటీ – మోసం గ్యారంటీ” నినాదంతో కూటమి మోసాలను ఎండగడదాం...వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా విస్తృతస్థాయి సమావేశం...
“బాబు మ్యారిటీ – మోసం గ్యారంటీ” నినాదంతో
కూటమి మోసాలను ఎండగడదాం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా విస్తృతస్థాయి సమావేశం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా విస్తృత స్థాయి సమావేశం కర్నూలు నగరంలోని లక్ష్మీ కల్యాణ మండపంలో ఆదివారం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పా ర్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, జిల్లా పరిశీలకులు గంగుల ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు కార్యక్రమం జిల్లా అధ్యక్షులు ఎస్.వి.మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా కూటమి పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, అధి కారంలోకి వచ్చాక మోసపూరిత పాలన సాగించడాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా రూపొందించిన “రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో”ను క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా ప్రజ లకు అందించడానికి ప్రారంభించారు. “బాబు మ్యారిటీ – మోసం గ్యారంటీ” అనే నినా దంతో ప్రజలలో చైతన్యం రేకెత్తించాలని పిలుపునిచ్చారు.
అనంతరం రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి,జిల్లా పరిశీలకులు గంగుల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు అలవి కాని హామీలతో ప్రజలను నమ్మించార ని,ఇంటింటికీ హామీల బాండ్లు పంపించి అధికారంలోకి వచ్చారని,కానీ ఒక్క హామీకి కూ డా న్యాయం చేయలేదని ధ్వజమెత్తారు. ‘సూపర్ సిక్స్’ పేరుతో ప్రజలను మభ్యపెట్టారని, హామీలు నెరవేర్చమంటే మక్కలు విరగ్గొడతామంటున్న పవన్ కళ్యాణ్కు ప్రజలే గట్టి సమా ధానం చెబుతారన్నారు.జిల్లా అధ్యక్షులు ఎస్.వి.మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక్కో ఇంటి కీ రూ.2.40లక్షలు జమ అవుతాయంటూ బాండ్లు ఇచ్చిన చంద్రబాబు,పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు.కొత్త పరిశ్రమలు వచ్చాయంటూ పచ్చ పత్రికల్లో పెయిడ్ ఆర్టికల్స్ వేయించుకున్నారని,వాస్తవా నికి ఒక్క పరిశ్రమైనా తెచ్చారా అని నిలదీశారు.
Comments
Post a Comment