మహాన్యూస్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య...నిందితులను కఠినంగా శిక్షించాలి...యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)...
మహాన్యూస్ పై దాడి హేయమైన చర్యనిందితులను కఠినంగా శిక్షించాలిజర్నలిజం పెరుగుతున్న దాడులు ఖండిచండియునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
వాస్తవాలను ప్రసారం/ప్రచురణ చేస్తున్న జర్నలిజంపై ప్రస్తుతం దాడులు,హత్యలు,అక్రమ కేసులు వంటి వాటితో భయబ్రాంతులకు గురిచేయడం సరైంది కాదని,ఈ నేపథ్యంలోనే హైదరాబాద్,మహాన్యూస్ కార్యాలయంపై బిఆర్ ఎస్ పార్టీ గుండాలు చేసిన దాడిని యు నైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తీవ్రంగా ఖండిస్తున్నట్లు,దాడికి పాల్పడిన గుండాలను తక్షణమే అ రెస్ట్ చేసి,కఠినంగా శిక్షించాలని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక సభ్యులు వి.విజ య్ కుమార్ పేర్కొన్నారు.ఈ మేరకు ఆదివారం మహాన్యూస్ పై దాడికి వ్యతిరేకంగా క ర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రింట్ / ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష,కార్యద ర్శులు విజయ్ కుమార్,మెట్రో మధు,చంద్రమోహన్,విద్యాసాగర్ ల ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లతో కలిసి నిరసన కార్యక్రమం ఏర్పాటుచేశారు.కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు నీ లం సత్యనారాయణ,వ్యవస్థాపక నాయకులు వి.విజయ్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజలకు,ప్రభుత్వాలకు మధ్య వారధిగా ప్రజా సమస్య ల పరిష్కారం కోసం జర్నలిస్ట్ లు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.అయితే అధికా రంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజలను నిష్పక్షపాతంగా పాలిస్తున్నాయా లేక అవినీతి,అక్రమా లకు పాల్పడుతున్నాయా అనే అంశాలపై జర్నలిజం సుదీర్ఘ విచారణ జరుపుతోందని చె ప్పారు.విచారణలో భాగంగా వాస్తవాలను ప్రజలకు తెలియచేసి వారిని చైతన్యం చేసే బా ధ్యతగా పని చేస్తుందన్నారు.ఇది సహించలేని రాజకీయ పార్టీలు సహించలేక మీడియా సంస్థలు,జర్నలిస్ట్ లపై దాడులు చేయడం పరిపాటిగా మారిందన్నారు.
అదేవిదంగా అధికారం అడ్డు పెట్టుకుని బిఆర్ ఎస్ పార్టీ చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పట్ల మహా న్యూస్ ప్రసారంను జీర్ణించుకోలేక బిఆర్ ఎస్ పార్టీ తన అనుచరులు,గుండాల తో మహా న్యూస్ కార్యాలయంపై రాడ్లు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేయడం హే యమైన చర్య అన్నారు.అవాస్తవాలను ప్రసారం చేస్తే ప్రజాస్వామ్య బద్దంగా అడ్డుకోవాలి కాని ఇలాంటి దాడులకు పాల్పడం,వీధి రౌడీల్లా వ్యవహరించడం దుర్మార్గం అని ఖండిం చారు.ఇది ప్రజాస్వామ్య దేశానికి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.
గతంలో కూడా జర్నలిజంపై ఉక్కుపాదం మోపిన రాజకీయాలు నేడు కాలగర్భంలో కలిసి పోయాయని,అదే పరిస్థితి బిఆర్ ఎస్ పార్టీకి ఏర్పడుతుందని హితవు పలికారు.ఇలాంటి ఘటనలను ప్రజాస్వామ్య వాదులు,మేధావులు, ప్రజాసంఘాలు,ప్రజలు తీవ్రంగా ఖండిం చాలని కోరారు.భవిష్యత్ లో మీడియాపై ఇలాంటి ఫటనలు పునఃరావృతం కాకుండా ప్ర భుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి మహా న్యూస్ కా ర్యాలయంపై దాడిని సుమోటోగా తీసుకుని దాడికి కారకులను తక్షణమే అరెస్ట్ చేసి,కఠి నంగా శిక్షించాలని,లేనిపక్షంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల జర్నలిస్ట్ లను కలుపుకుని ఉద్య మం చేపడతామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కర్నూలు నగర కార్యదర్శి ముని స్వామి,సీనియర్ జర్నలిస్ట్ శ్రీనాధ్ రెడ్డి,ప్రింట్ / ఎలక్ట్రానిక్ కర్నూలు జిల్లా నాయకులు అవి నాష్,కిషోర్,పరమేష్, అసిఫ్,రాజశేఖర్,వై.వి.రెడ్డి,గిలిగిత్త విజయ్ కుమార్,పి.జి.వెంకటే ష్,లక్ష్మి నారాయణ,శేఖర్,మధు,నరసింహ,రఫీ,రాము,విద్యార్థి సంఘాలు ఎస్ ఎస్ ఐ నాయకులు అమర్,పిడిఎస్ యు నాయకులు రమణ,జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.





Comments
Post a Comment