జిజిహెచ్ ఫార్మసిస్ట్ టోకరా...లక్షల్లో మోసంకలెక్టర్ కు పిర్యాదు చేసిన బాధితుడు...
జిజిహెచ్ ఫార్మసిస్ట్ టోకరా...లక్షల్లో మోసంకలెక్టర్ కు పిర్యాదు చేసిన బాధితుడు
కర్నూలు జిల్లా,ఎమ్మిగనూరు జిజిహెచ్ (ప్రభుత్వాసుపత్రి)లో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న బీ. శారద...ఎన్జీఓ పేరుతో లక్షల్లో మోసాలకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎ దుట వెలుగుచూసింది.ఈ మేరకు శనివారం బాధితుడు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశా డు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...స్పందన పేరుతో ఎన్జీఓని ప్రారంభిం చిన శారద...మహేంద్ర అనే వ్యక్తి ద్వారా 'సహజా శానిటరీ ప్యాడ్స్' తయారీ కేంద్రాన్ని ఎమ్మిగనూరులో స్థాపించారు.ప్రభుత్వ 'స్వేచ్ఛ' కార్యక్రమంలో భాగంగా సర్వశిక్షా అభి యాన్ ద్వారా కర్నూలు,అనంతపురం జిల్లాల్లోని పాఠశాలల బాలికలకు శానిటరీ నాప్ కిన్లు సరఫరా చేసేందుకు టెండర్లు దక్కించుకున్నారు.ఈ వ్యాపారంలో భాగస్వామ్యం పే రుతో... కర్నూలుకు చెందిన చంద్రశేఖర్ దగ్గర రెండు లక్షలు బ్యాంకు నుండి మూడు లక్షలు నగదు రూపంలో తీసుకున్నారన్నారు."బిల్లులు వచ్చిన తర్వాత వాటా ఇస్తాను, అ సలు మొత్తం తిరిగి చెల్లిస్తాను"అని చెప్పి...ఇప్పటి వరకు ఆ మొత్తం ఇవ్వకుండా కాల యాపన చేస్తున్నారని బాధితుడు చంద్రశేఖర్ ఆవేదన చెందారు.తమ ఖర్చుల కోసం అ ప్పులు చేసి ఇప్పటికే ఐదు లక్షల వరకు వడ్డీలు చెల్లించాల్సి వచ్చిందని ఆయన వాపో యారు.అంతేకాదు...మరో ఇద్దరు వ్యక్తుల నుండి కూడా రెండు లక్షలు తెప్పించి పెట్టుబడి పెట్టించారని,వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బులు తీసుకున్నారని ఆరోపిం చారు.ఫార్మసిస్టుగా పనిచేస్తూ, ఇతరుల పేర్లతో సంస్థలు నెలకొల్పి...ప్రభుత్వ టెండర్లు పొందుతూ,మధ్యవర్తుల ద్వారా వ్యాపారాలు చేస్తూ,చివరకు మోసాలకు పాల్పడుతు న్నారని చంద్రశేఖర్ పేర్కొన్నారు.తగు విచారణ జరిపించి తమకు న్యాయం చేయాల ని...బీ.శారదపై శాఖాపరమైన చర్యలు తీసుకొని,క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాధితుడు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment