రోడ్లపై పొంగి ప్రవహిస్తున్న మురికి నీరు... పట్టణ పౌర సంక్షేమ సంఘం...
రోడ్లపై పొంగి ప్రవహిస్తున్న మురికి నీరుప్రధాన మురుగుకాలువలు శుభ్రం చేయించాంప్రకటించిన మున్సిపల్ కమిషనర్ మురుగు,చెత్తతో నిండిన పొర్లి పొంగుతున్న మురికి కాలువలుఏడాది క్రితం దాదాపు కోటితో నిర్మించిన మురిగుకాలువలు ఎవరికోసం? ఏమయ్యాయి?రోడ్డుకు ఒకవైపు నిండిన కాలువలు,మరోవైపు ఎండిన కాలువలుఅడ్రస్ లేని ఆరోగ్యశాఖ అధికారులుపట్టణ పౌర సంక్షేమ సంఘం
కర్నూలు నగరంలో 15 కాలనీలకు వెళ్లే 60అడుగుల ప్రధాన రోడ్డుపై మురిగునీరు ప్రవహి స్తూ ట్రాఫిక్ అంతరాయం కలిగే పరిస్థితి ఏర్పడి గంటలు గడుస్తున్న ప్రజారోగ్య శాఖ అధి కారులు సానిటరీ ఇన్ స్పెక్టర్లు ఏం చేస్తున్నారని పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎ. ఆంజనేయులు గౌడ్,మహమ్మద్ యూనుస్,ఇరిగినేని పుల్లారెడ్డి ప్రశ్నించారు.ఇళ్ళ ముం దు మురికి నీరు ప్రవహిస్తున్నందున బయటికి వెళ్లే పరిస్థితి లేదని అశోక నగర్,శ్రీ నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు శుక్రవారం ఉదయం పిపిఎస్ ఎస్ ప్రతినిధి బృందం ఆ ప్రాం తంలో పర్యటించింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారుల కు పన్నులు పెంచడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంపై లేదని విమ ర్శించారు.నగరంలో ఒకటి రెండు ప్రాంతాలు మినహా అన్ని ప్రధాన మురికి కాలువల్లో పేరు కొనిపోయిన మురికిని,చెత్తను తొలగించామని ప్రకటించి 24గంటలు గడవక ముందే అశోక్ నగర్ ప్రధాన మురికి కాలువలు నిండి,60అడుగుల రోడ్డుపై మురికి నీరు ప్రవహించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు.ఈ ప్రాంతంలో ఏడాది క్రితం దాదాపు కోటి రూపాయలు వెచ్చించి నిర్మించిన మురికి కాలువలు ఎవరికోసం నిర్మించారు? ఆ కా లువలు ఏమయ్యాయని ప్రశ్నించారు.రోడ్డుకు ఒకవైపు కాలువలు నిండి రోడ్డుపై ప్రవహి స్తుంటే మరోపక్క నీళ్లు లేకుండా చెత్త చెదారం పేరుకుపోయిన వట్టి కాలువ దర్శనమి స్తుందన్నారు.రోడ్లపై మురికి నీరు ప్రవహిస్తున్నందువల్ల స్కూల్ పిల్లలు,స్థానిక ప్రజలు పక్క వీధి మీదుగా వెళ్లే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఉన్నతాధికారులు స్పందించి ప్రజల అసౌకర్యం కలగడానికి కారణమైన ప్రజారోగ్య అధికారి,శానిటరీ ఇన్ స్పెక్టర్ లపై చర్యతీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ పర్యటనలో ఎస్.ఆర్.గౌడ్,రఫీ క్,ధనరాజు, ఇస్మాయిల్,నరసింహ,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment