బీఎస్ఎఫ్ జవాన్ భూమి విషయంలో అధికారుల నిర్లక్ష్యం తగదు...
బీఎస్ఎఫ్ జవాన్ భూమి విషయంలోఅధికారుల నిర్లక్ష్యం తగదు
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
దేశ భద్రత కోసం ప్రాణాలను పనంగా పెట్టి సేవలు అందిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ షేక్ ఖలీ ల్ భూమి విషయంలో స్థానిక రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.వివ రాలు ఇలా ఉన్నాయి.కర్నూలు జిల్లా, నందవరం మండలం,నాగలదిన్నె గ్రామానికి చెంది న షేక్ ఖలీల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పని చేస్తున్నారు.నందవరం మండలం గురజా ల గ్రామ సరిహద్దుల్లో ఆయనకు సొంతంగా 2.00 ఎకరాల భూమి ఉంది.అయితే వైఎ స్సార్సీపీ ప్రభుత్వ హయంలో చేపట్టిన జగనన్న రీ-సర్వే సమయంలో అధికారులు కేవ లం 1.32 ఎకరాలు మాత్రమే చూపించారు.
| సచివాలయ ధ్రువపత్రం |
వాస్తవాలను పూర్తిగా నమోదు చేయాలని,మళ్లీ సర్వే చేసి న్యాయం చేయాలని ఖలీల్ ఇ ప్పటికే పలుమార్లు స్థానిక రెవెన్యూ అధికారులను,జిల్లా కలెక్టర్ను కలసి విన్నవించారు. కానీ ఇప్పటికీ స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.‘‘దేశానికి సేవ చేస్తున్న నాకు ఇంత నిర్లక్ష్యం అయితే... సామాన్య రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనడా నికి ఇది నిదర్శనం’’ అని ఖలీల్ ఆవేదన వ్యక్తం చేశారు.పాలకులు,అధికారులు స్పందిం చి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.రెవిన్యూ అధికారులకు తమ గోడును వి న్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందన్నారు.కర్నూల్ కలెక్టరేట్లో జరిగే ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక కార్యక్రమంలో దాదాపు ఎనిమిది సార్లు ఫిర్యాదు చేసిన రెవెన్యూ అ ధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.తమ పొలం పక్కన ఒక రెవెన్యూ అధికా రికి సంబంధించిన వారిది పొలం ఉండడంతో వారి అండదండలతోనే తమకు న్యాయం చేయడం లేదని వాపోయారు.దేశ సరిహద్దు నుంచి సెల్ఫీ వీడియో ద్వారా తన బాధను మీడియాకు వెల్లడించారు.ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్,జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు,మంత్రి టీ.జీ.భరత్ తమ కుటుంబానికి న్యాయం చేయాలని జవాన్ కోరారు.

Comments
Post a Comment