ఏపీలో ఆటో డ్రైవర్ లకు తీపి కబురు... రూ.10 వేలు అర్థక సహాయం....మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన...
ఏపీలో ఆటో డ్రైవర్ లకు తీపి కబురురూ.10 వేలు అర్థక సహాయం మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన
ఏపీలోని ఆటోడ్రైవర్లకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది.రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లకు రూ. 10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.ఈ విషయాన్ని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు,శ్రీకాకుళం జిల్లా,పలాసలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి...అన్నదాత సుఖీ భవ పథకం తొలి విడత నిధులను త్వరలోనే రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తామ న్నారు.రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో పీఎం కిసాన్ యోజనతో కలిపి ఏడాదికి రూ.20 వేలు అందించనున్నట్లు తెలిపారు.అలాగే రాష్ట్రంలోని ప్రతి ఆటో డ్రైవర్కు కూడా త్వరలోనే రూ. 10వేలు అందిస్తామని అన్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వం లో ఏపీకి పెట్టుబడులు తరలివస్తున్నాయన్న కొల్లు రవీంద్ర...ఇప్పటి వరకూ పది లక్షల కో ట్లు పెట్టుబడులు వచ్చాయని వివరించారు.మరోవైపు మహిళల కోసం ఆగస్ట్,15వ తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించనున్న సంగతి తెలి సిందే.సూపర్ సిక్స్ హామీలలో మాట ఇచ్చిన విధంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచి త బస్సు ప్రయాణం సదుపాయం కల్పించనుంది.తొలుత జిల్లాల వరకే ఈ పథకాన్ని పరి మితం చేయాలని భావించినప్పటికీ...రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు పథకం అమలు చే యనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల ప్రకటించారు.నారా లోకేష్తో చర్చించిన త ర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.ఇక ఉచిత బస్సు పథకం అమల్లో భాగంగా మ హిళలకు జీరో ఫేర్ టికెట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ టికెట్ల మీద ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణిస్తున్నారు.ఉచిత బస్సు పథకం వలన వారికి ఎంత మేరకు డబ్బు లు ఆదా అయ్యాయనే వివరాలను ముద్రించనున్నారు.దీంతో ఈ పథకం వలన ఎంత మేరకు ప్రయోజనం పొందామో మహిళలకు తెలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.మరో వైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి వస్తే ఆటో డ్రైవర్లకు గిరాకీ త గ్గుతుందని,ఉపాధి దెబ్బతింటుందనే ఆందోళనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించిన రోజే ఆటోడ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం అందిస్తామ ని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారని అన్నారు.అయితే ఎంతమేరకు అనే దానిపై క్లారిటీ లేకపోగా...తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర దీనిపై క్లారిటీ ఇచ్చారు.ఆటో డ్రైవర్లకు రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తాజాగా ప్రకటించారు.
Comments
Post a Comment