ముజఫర్ నగర్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహిస్తున్న 81,82 సచివాలయాలు ఖాళీ చేయాలి...టి.రాముడు,సిపిఎం పార్టీ నగర కార్యదర్శి...
ముజఫర్ నగర్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహిస్తున్న 81,82 సచివాలయాలు ఖాళీ చేయాలిటి.రాముడు,సిపిఎం పార్టీ నగర కార్యదర్శి
కర్నూలు నగరం,32వ వార్డు ముజఫర్ నగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న 81,82స చివాలయాలను ఖాళీ చేయాలని ప్రజా సమస్యల ప్రజా వేదిక కార్యక్రమంలో నగర పా లక సంస్థ కమీషనర్ పి విశ్వనాథ్ ని కలిసి సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి.రాముడు కా ర్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా కె.సుధాకరప్ప,ఆర్. నరసింహులు,జి.ఏసులు కలిసి సోమవారం వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముజ ఫర్ నగర్ లో ఉన్న నండూరి ప్రసాదరావు కమ్యూనిటీ హాలు చుట్టుపక్కల వున్న ప్రాంతా లలోని ప్రజలకు వివాహాలు,ఫంక్షన్లు చేసుకోవడానికి పొదుపు గ్రూపుల సమావేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని,అలాంటిది అప్పటి ప్రభుత్వ నిర్ణయం మేరకు గతంలో ఉన్న కమిషనర్ సచివాలయాల కోసం కేటాయించాలని ఒత్తిడి చేసిన కారణంగా ఆరు నెలలలో ఖాళీ చేస్తామని అప్పటి కమిషనర్ రాతపూర్వక హామీ మేరకు సచివాలయాల కు కేటాయించినట్లు చెప్పారు.దాదాపు ఆరు సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు ఖాళీ చేయకపోవడం వల్ల,ప్రజలు పెళ్లిళ్లు చేసుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేసు కోలేని పరిస్థితిలో కమ్యూనిటీ హాల్ ఆరు బయటనే వివాహాలు చేసుకోవలసి వస్తుందని వారు తెలిపారు.సచివాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్, కమిషనర్ లకు అనేకసార్లు వి నతిపత్రాలు ఇచ్చిన త్వరలోనే నిర్మాణం చేస్తామని హామీ ఇస్తున్నారు తప్ప,ఇప్పటివరకు ఎ లాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆగ్రహం చెందారు. సచివాలయాల నిర్మాణం కోసం ముజఫర్ నగర్ నీళ్ల ట్యాంక్ దగ్గర స్థలం కేటాయించి,పనులు మొదలుపెట్టి నిర్మాణాన్ని కరోనా సందర్భంగా ఆపివేయడం జరిగిందని పేర్కొన్నారు.తక్షణమే సచివాలయం నిర్మా ణం చేపట్టి, ప్రజాప్రయోజనాల కోసం నిర్మించుకున్న నండూరి ప్రసాదరావు కమ్యూనిటీ హాల్ ను అప్పగించాలని కమిషనర్ ను కోరారు.అనంతరం కమిషనర్ మాట్లాడుతూ త్వ రలోనే సచివాలయాల నిర్మాణం చేపట్టి కమ్యూనిటీ హాల్ ను అప్పగిస్తామని హామీ ఇచ్చా రు.
Comments
Post a Comment