తెలంగాణ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులు...
తెలంగాణ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. న్యాయవాదుల కోటాలో గౌస్ మీరా మొహియుద్దీన్, సుద్దాల చలపతిరావు,వాకిటి రామ కృష్ణారెడ్డి,గాడి ప్రవీణ్కుమార్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరిం చనున్నారు.హైకోర్టు న్యాయవాదులుగా ఉన్న వీరిని అదనపు జడ్జిలుగా నియమించాలం టూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు తాజాగా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశా రు.దీంతో ఈ నలుగు రు అదనపు న్యాయమూర్తుల నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.హైకోర్టులో మొత్తం ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య 42కాగా ప్రస్తుతం 26మంది పనిచేస్తున్నారు.కొత్తగా నలుగురు న్యాయమూర్తుల చేరికతో ఈ సంఖ్య 30కి చేరనుంది. వీరిలో గౌస్ మీరా మొహీ యొద్దీన్,చలపతిరావు సుద్దాల,వాకిటి రామకృష్ణారెడ్డి,ప్రవీణ్ కుమార్ లు అదనపు న్యాయమూర్తులుగా నియమి తులయ్యారు.
Comments
Post a Comment