రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డిఎస్పీ పార్థివ దేహానికి ఘన నివాళులు...చదలవాడ నాగరాణి,జిల్లా కలెక్టర్...అద్నాన్ నయీం అస్మి,జిల్లా ఎస్పీ...
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డిఎస్పీ పార్థివ దేహానికి ఘన నివాళులుచదలవాడ నాగరాణి,జిల్లా కలెక్టర్అద్నాన్ నయీం అస్మి,జిల్లా ఎస్పీ
తెలంగాణ,యాదాద్రి జిల్లాలో గత శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డీఎస్పీ మే క చక్రధర్ రావు పార్థివ దేహం వారి స్వగృహానికి ఆదివారం పాలకొల్లు పట్టణం చేరుకుం ది.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి,జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మేక చక్రధర్ రావులు డీఎస్పీ మేక చక్రధర్ రావు పార్థివ దేహంపై పుష్ప గుచ్చాలను ఉం చి నివాళులర్పించి సంతాపాన్ని తెలియజేశారు.ఈ సందర్బంగా వారి సతీమణిని,కుటుం బ సభ్యులను పరామర్శించి ఓదార్చి,ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.అనంతరం జి ల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వపరంగా మేక చక్రధర్ రావు కు టుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
ఏపీ పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో డీఎస్పీగా పనిచేస్తున్న చక్రధరరావు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా,పాలకొల్లు కాగా భార్య,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.వీరు 1996 లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ లోకి డైరెక్ట్ రిక్రూ ట్మెంట్ అపాయింట్ అయ్యారు.ఫస్ట్ అపాయింట్మెంట్ ఆర్.ఎస్.ఐ.హైదరాబాద్.మేక చక్ర ధర్ రావు తండ్రి మేక కుమారస్వామి,తల్లి మేక సూర్య కళావతి.వీరికి మొత్తం ఐదుగురు మగ సంతానం.చక్రధర్ రావు మామ కామన సూర్య భాస్కర్ రావు అగ్రికల్చర్ మార్కెటిం గ్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయ్యారు.వీరి తండ్రి కుమారస్వామి మధ్యతరగతికి చెందిన వారు.పిల్లలు అందరినీ కాయకష్టం చేసి చదివించారు.ఒక సంవత్సరం క్రితం డీఎస్పీగా ప్రమోషన్ వచ్చినప్పుడు వీరి కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు చాలా సంతోష పడ్డారు.ఇంతలోనే ఇలా జరగడం చాలా దురదృష్టకరం.
Comments
Post a Comment