చిల్లి చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం అమ్మకాలు...
చిల్లి చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం అమ్మకాలు
ప్రస్తుతం సమాజంలో కొందరికి చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు వారంలో ప్రతిరోజు పెట్టిన చికెన్ తింటుంటారు.చికెన్ తో తయా రు చేసే వివిధ వెరైటీలను ఇండ్ల లోను రెస్టారెంట్లో తింటూనే ఉం టాం.చికెన్ వంటకాలు అంటే ప డి చచ్చే వారికి నిజంగానే ఇది షాకింగ్ న్యూస్...ఎందుకంటే చి కెన్ పేరుతో గబ్బిలాల మాంసం అమ్ముతున్నారు కొందరు రెస్టారెంట్ లు.ఫాస్ట్ ఫుడ్ సెంట ర్లకు చికెన్ కు బదులు గబ్బిలాల మాంసాన్ని పంపుతున్నారని తెలిసింది.ఈ షాకింగ్ ఘట న తమిళనాడులో వెలుగు చూసింది.గబ్బిలాలను వేటాడి చికెన్ అని చెప్పి అమ్ముతున్న ఇ ద్దరు వ్యక్తులను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తెలిసిన వి వరాల ప్రకారం...తమిళనాడు రాష్ట్రంలోని డానిష్ పేట పరిధిలోని తోప్పూర్ రామస్వామి కొండ ప్రాంతంలో తరచుగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని డానిష్ పేట అ టవీ కార్యాలయానికి సమాచారం అందింది.దీంతో ఫారెస్ట్ రేంజర్ విమల్కుమార్ నేతృ త్వంలోని అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించారు.నిజంగానే అక్కడ తుపాకీ కాల్పుల శబ్దాలు వారికి వినిపించాయి.దీంతో ఏంటని వారు అటవీ ప్రాంతాన్ని మొత్తం గాలించారు.ఈ క్రమంలోనే వారికి కమల్,సెల్వం అనే ఇద్దరు వ్యక్తులు కన్పిం చారు.వెంటనే అటవీ శాఖ అధికారులు వారి ఇద్దరిని పట్టుకుని తుపాకీ స్వాధీనం చేసు కున్నారు.ఆ తర్వాత వారిని విచారించగా...వారు ఎలాంటి విషయాలు చెప్పలేదు. కాక పోతే వారిద్దరూ ఓ హోటల్ నిర్వహిస్తూ చికెన్ అమ్ముతున్నారు. దీంతో వారు గబ్బిలాల మాంసంతోనే చికెన్ చేస్తున్నట్లు అనుమానించిన స్థానికులు అదే నిజమై ఉంటుందని పో లీసులకు చెప్పారు.ఇలా పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా...పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చే శారు.అయితే ప్రస్తుతం వారు నోరు మెదపడం లేదని...తాము ఎలాంటి తప్పు చేయడం లేదని మాత్రమే చెబుతున్నారని పోలీసులు వివరించారు.ఈ కేసును మరింత లోతుగా ద ర్యాప్తు చేసిన తర్వాతే అసలు విషయాలు తెలుస్తాయని అంటున్నారు. మరోవైపు ఓమలూ రు సమీపంలోని పన్నపట్టి పంచాయతీలోని వవ్వాల్తోప్పు ప్రాంతంలో ఒక చెట్టుపై లక్ష లాది గబ్బి లాలు నివసిస్తున్నాయని...వాటిని వేటాడటానికి కూడా వీరిద్దరూ ప్రయత్నించి నట్లు ఆ గ్రామస్థులు చెబుతున్నారు.
Comments
Post a Comment