బిచ్చగాళ్ల “వీర్యం”...అడ్డాకూలీల “అండం”... పోలీసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు...
బిచ్చగాళ్ల “వీర్యం”...అడ్డాకూలీల “అండం”వీర్యం,అండాల దందాలో వికృత పార్శ్వాలుచదువురానివారికైతే...బిర్యానీ పొట్లం, మందు బాటిల్విద్యావంతులకు రూ.4వేల వరకు చెల్లించి వీర్యం సేకరణఅండ దానం చేసే మహిళలకు రూ.20-రూ.25 వేలుపోలీసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు
వీర్యం,అండాల సేకరణ పేరుతో నగరంలో జరుగుతున్న వికృత దందా ఇది.సంతాన భా గ్యం లేక దాతల నుంచి వీర్యం, అండాల వంటివి కోరుకునేవారు.ఆ దాతలు బాగా చదు వుకున్నవారై,మంచి తెలివితేటలు కలిగినవారై ఉండాలని భావిస్తారు.కానీ...ఈ దందా న డిపేవారు వారికి అంటగడుతున్నది బిచ్చగాళ్లు,అడ్డాకూలీల వీర్యాన్ని,అండాలను.'ఇండి యన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్' పేరుతో సికింద్రాబాద్ లో ఈ దందా నడుపుతున్న ఏ డుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.దీనిపై లోతైన దర్యాప్తు చేయగా విస్తు పోయే విషయాలు వెలుగుచూశాయి.ఈ క్లినిక్ యజమాని, మేనేజర్ గా వ్యవహరిస్తున్న పంకజ్ సోని తన వద్ద కొంతమందిని ఏజెంట్లుగా,టెక్నీషియన్లుగా నియమించుకున్నా డు.వారు..బిచ్చగాళ్లకు,అడ్డాకూలీల వంటివారికి డబ్బు ఆశ చూపించి వారి నుంచి వీర్యం, అండాలను సేకరిస్తున్నారు.ఆర్ట్ (అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ) నిబంధనల ప్రకారం ఆరో గ్యవంతులైన వ్యక్తుల నుంచి,అదీ 21 నుంచి 55 ఏళ్లలోపు ఉన్నవారి నుంచి...వారికి అ న్నిరకాల వైద్యపరీక్షలు నిర్వహించి, ఎలాంటి జన్యువ్యాధులు, అంటువ్యాధులు లేవని ని ర్ధారించుకున్న తర్వాత మాత్రమే వీర్యం సేకరించాలి. ఒక దాత నుంచి గరిష్ఠంగా 25సా ర్లు మాత్రమే వీర్యాన్ని సేకరించాలి.ఒక దాత నుంచి తీసుకున్న వీర్యాన్ని ఒక మహిళకు ఒకసారి గర్భధారణకు మాత్రమే ఉపయోగించాలి.కానీ...స్పెర్మ్ క్లినిక్ లు ఈ నిబంధనల న్నింటినీ తోసిరాజని ఒకే వ్యక్తి నుంచి వారానికొకసారి చొప్పున వీర్యం సేకరిస్తున్నాయి. ఉదాహరణకు...ఇండియన్ స్పెర్మ్టెక్ ఏజెంట్లు బిచ్చగాళ్లు,అడ్డాకూలీలను సంప్రదించి.. "వారానికోసారి ఇక్కడకు వచ్చి మేం చెప్పినట్లు చేస్తే మందుతో పాటు బిర్యానీ ఇప్పిస్తా మంటూ వారికి ఆశపెట్టేవారని తెలిసింది.లేదంటే వాటికి సరిపడా రూ. 500- రూ.10 00 చేతిలో పెట్టి పంపేవారని సమాచారం.అలా వచ్చేవారు...తమకు తెలిసిన మహిళలను తీసుకొస్తే...వారి నుంచి అండాలు సేకరించేవారు.అది కొంచెం కష్టమైన పని కావడంతో మహిళలకు ప్రతిసారీ రూ.20 వేల నుంచి రూ.25 వేలు చెల్లించేవారని తెలిసింది.నిం దితులను మరోసారి కస్టడీకి తీసుకొని విచా రించేందుకు గోపాలపురం పోలీసులు కోర్టు లో కస్టడీ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది.
Comments
Post a Comment