ఓరి మీ దుంపలు తెగ...మరీ ఇంత పిచ్చా... సెల్ఫీ మోజులో జలపాతంలో కొట్టుకుపోయిన కుటుంబం...
ఓరి మీ దుంపలు తెగ...మరీ ఇంత పిచ్చాసెల్ఫీ మోజులో జలపాతంలో కొట్టుకుపోయిన కుటుంబంఝార్ఖండ్లోని ప్రసిద్ధ భటిండా జలపాతం వద్ద ఘటనపశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన కుటుంబంమునిగిపోతున్న కుటుంబాన్ని రక్షించిన స్థానికులు
సెల్ఫీ మోజులో ఓ కుటుంబం జలపాతంలో కొట్టుకుపోయింది.ఝార్ఖండ్లోని ధన్బాద్ స మీపంలోని ప్రసిద్ధ భటిండా జలపాతం వద్ద నిన్న జరిగిందీ ఘటన.పశ్చిమ బెంగాల్లోని పూర్బ బర్ధమాన్ జిల్లాకు చెందిన ఒక కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు జలపా తాన్ని సందర్శించారు.అక్కడ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీటి ప్రవా హంలో కొట్టుకుపోయారు.అప్రమత్తమైన స్థానికులు,మత్స్యకారులు వెంటనే స్పందించ డంతో పెను ప్రమాదం తప్పింది.సాక్షుల కథనం ప్రకారం...భటిండా జలపాతం వద్ద వే గంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహం సమీపంలో సెల్ఫీలు తీసుకునేందుకు బాధిత కుటుం బం ప్రయత్నించింది.ఈ క్రమంలో కుటుంబంలోని ఒక మహిళ అకస్మాత్తుగా కాలు జారి నీటిలో పడిపోయింది.వెంటనే అప్రమత్తమైన ఆమె భర్త,కొడుకు, కూతురు ఆమెను రక్షిం చేందుకు వెంటనే నీటిలోకి దూకారు.అయితే జలపాతం వద్ద ఉన్న బలమైన ప్రవాహం కా రణంగా నలుగురూ మునిగిపోయారు.సమీపంలో చేపలు పట్టుకుంటున్న స్థానికులు గమ నించి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీళ్లలో దూకి వారిని రక్షించి ఒడ్డుకు తీ సుకొచ్చారు.భటిండా జలపాతంలో సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదాలకు గురైన ఘటనలు గ తంలోనూ జరిగాయి.2024 ఆగస్ట్ లో సెల్ఫీలు తీసుకుంటూ ముగ్గురు వ్యక్తులు కొట్టుకు పోగా స్థానికులు వారిని రక్షించారు.కాగా,తాజాగా ప్రమాదం నుంచి బయటపడిన కు టుంబ సభ్యులను చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Comments
Post a Comment