విద్యా సంస్ధల వద్ద యాంటీ ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ నివారణకు డ్రోన్,శక్తి టీమ్ ల నిఘా తో పటిష్ట చర్యలు....
విద్యా సంస్ధల వద్ద యాంటీ ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ నివారణకు డ్రోన్,శక్తి టీమ్ ల నిఘా తో పటిష్ట చర్యలుమహిళల భద్రతకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్న కర్నూలు పోలీసులువిద్యార్థుల్లో భద్రతాభావం పెరిగే విధంగా పటిష్ట చర్యలు
కర్నూలు నగరంలోని ఆర్ ఎస్ రోడ్డు లో ఉన్న కెవిఆర్ కళాశాల,మౌర్యన్ దగ్గర ఉన్న చైత న్య కళాశాలల సమీపంలో ఆకతాయిల ఆటకట్టించేందుకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలతో శక్తీ టీం పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. సోమవారం శక్తి టీమ్ సిఐ విజయలక్ష్మీ ఆధ్వర్యంలో బాలికలు,మహిళలకు భద్రతపై భ రోసా కల్పిస్తూ అత్యాధునిక డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ ఈవ్ టీజింగ్ కు పాల్పడే వా రిపై దృష్టి సారించారు.పాఠశాలలు,కళాశాలల వద్ద ఈవ్ టీజింగ్,ర్యాగింగ్ వంటి సంఘ టనలు ఎదుర్కొనకుండా ఉండేందుకు డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు.విద్యార్థుల్లో భద్రతాభావం పెరిగే విధంగా పటిష్ట చర్యలు చేపట్టారు.మహిళలను,అమ్మాయిలను వేధిం చే ఆకతాయిలను,అనుమానితులను డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి,వారిని అదుపులోకి తీసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టారు.మహిళల,అమ్మాయిల భద్రత మరియు శాం తి భద్రతలను కాపాడేందుకు కర్నూలు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తు న్నారన్నారు.డ్రోన్ పర్యవేక్షణతో పాటు పోలీసు బృందాలు కూడా పటిష్టమైన పెట్రోలింగ్ చేపట్టాయి.ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ విజయలక్ష్మీ,'శక్తి' టీమ్ సిబ్బం ది పాల్గొన్నారు.
Comments
Post a Comment