హరిద్వార్లోని ఆలయంలో తొక్కిసలాట... ఆరుగురి మృతి...
హరిద్వార్లోని ఆలయంలో తొక్కిసలాటఆరుగురి మృతి
ఉత్తరాఖండ్ రాష్ట్రం,హరిద్వార్ లోని మన్సాదేవి ఆలయం వద్ద అపశ్రుతి చోటుచేసుకుం ది.ఆదివారం ఉదయం భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో...తొక్కిస లాట జరిగింది.ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడి నట్లు గర్హ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే వెల్లడించారు.క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని...ఆలయం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నా యని తెలిపారు.విద్యుత్ షాక్ కారణంగా భయభ్రాంతులకు గురైన భక్తులు ఒక్కసారిగా ప రుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగి ఉండొచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నట్లు గర్హ్వాల్ కమిషనర్ తెలిపారు.విద్యుత్ షాక్కు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నా రు.ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.ఇది బాధాకరమైన విషయమని...ఘటనా స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ఘటనకు గల కా రణాలపై దర్యాప్తు కొనసాగుతోందని...అధికారులతో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
Comments
Post a Comment