నాణ్యత, పరిశుభ్రం పాటించని హోటల్స్ పైన చర్యలు తీసుకోండి...డివైఎఫ్ ఐ...
నాణ్యత, పరిశుభ్రం పాటించని హోటల్స్ పైన చర్యలు తీసుకోండిడివైఎఫ్ ఐ
కర్నూలు జిల్లా వ్యాప్తంగా సరైన నాణ్యత అందించకుండా,పరిశుభ్రత పాటించకుండా ప్ర జల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న హోటల్స్ పై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర అబ్దుల్లా కలెక్టర్ రంజిత్ భాషకి విజ్ఞప్తి చేశారు.సోమవారం ప్ర జా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ బృందం వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యద ర్శులు రాఘవేంద్ర,అబ్దుల్లా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా హోటల్ నిర్వాహకులు సరైన శుభ్రత నాణ్యత పాటించకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని తెలియ చేశారు.జిల్లా వ్యాప్తంగా చాలా మంది ప్రజలు గ్యాస్ట్రిక్ అల్సర్ ఇతర అనారోగ్య సమస్య లకు గురవుతున్నారు అని అన్నారు.డాక్టర్లు సైతం హోటల్స్ లో చేసే భోజనాలు ఆరోగ్యా నికి మంచివి కాదని అంటున్నట్టు తెలియజేశారు.అలాగే ధరలు పెరుగుతున్నాయని సా కు చెప్పి విపరీతమైన ధరలు పెంచి ప్రజల కష్టాన్ని కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటు న్నారని అన్నారు.ఒక్కో హోటల్లో ఒక్కో ధర పెడుతూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. మాంసాహారం నాలుగైదు రోజుల పాటు ఫ్రిజ్లో పెట్టి,కల్తీ నూనె వాడి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న పరిస్థితి ఉందన్నారు.ప్రభుత్వ నిబంధనలు చాలా హోటల్లో పాటిస్తున్న పరిస్థితి లేదని అలాంటి హోటల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.వి నతి పత్రం అందించిన వారిలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ప్రకాష్,నాయకులు గోవర్ధన్ పాల్గొన్నారు.
Comments
Post a Comment