మెదక్లో వరదల బీభత్సం...నీట మునిగిన పౌల్ట్రీ ఫాం...10 వేల కోళ్లు మృతి...
మెదక్లో వరదల బీభత్సం...నీట మునిగిన పౌల్ట్రీ ఫాం10 వేల కోళ్లు మృతి
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి.అకస్మా త్తుగా పోటెత్తిన వరదలకు వేలాది మూగజీవాలు బలవుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లా, నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో చోటుచేసుకున్న ఓ విషాద సంఘటన రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫాంను వరద నీరు పూర్తిగా ముంచెత్తడంతో సుమారు 10వేల కోళ్లు ప్రాణాలు విడిచాయి.వివరాల్లోకి వెళితే...నంది గామలో ఓ రైతు నిర్వహిస్తున్న కోళ్ల ఫాంలోకి ఈరోజు ఒక్కసారిగా వరద నీరు పోటెత్తిం ది.చూస్తుండగానే ఫాం మొత్తం నీటితో నిండిపోవడంతో లోపల ఉన్న కోళ్లు బయటకు రాలేక ఊపిరాడక మృత్యువాత పడ్డాయి.ఈ ఘటనలో తనకు దాదాపు రూ.14 లక్షల ఆ స్తి నష్టం వాటిల్లిందని ఫాం యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.ఊహించని విధంగా వర ద రావడంతో కోళ్లను కాపాడుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని ఆయ న కన్నీటిపర్యంతం అయ్యారు. ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్న ఫాం కళ్ల ముందే నా శనమైందని,ప్రభుత్వం తమను ఆదుకుని ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ ఒక్క ఘటనే కాదు,మెదక్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇదే విధమైన పరిస్థితులు నెలకొన్నాయి. వాగులు,వంకలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.పలుగ్రా మాల్లో పశువుల పాకలు సైతం నీట మునిగాయి.పశువులను మేపేందుకు వెళ్లిన రైతులు వరదల్లో చిక్కుకుపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టి,బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్ర యత్నాలు చేస్తున్నారు.
Comments
Post a Comment