నాయుడుపేటలో గంజాయి ముఠాగుట్టు రట్టు చేసిన పోలీసులు...పట్టణ సీఐ బాబి ఆధ్వర్యంలో 11.5కిలోల గంజాయి పట్టివేత...
నాయుడుపేటలో గంజాయి ముఠాగుట్టు రట్టు చేసిన పోలీసులుపట్టణ సీఐ బాబి ఆధ్వర్యంలో 11.5 కిలోల గంజాయి పట్టివేత ఆరుగురు గంజాయి ముఠాసభ్యులు అరెస్ట్2మోటార్ బైకులు,4సెల్ ఫోన్లు స్వాధీనం14మంది యువతకు కౌన్సిలింగ్
తిరుపతి జిల్లా,నాయుడుపేటలో పట్టణ సిఐ బాబి పర్యవేక్షణలో విద్యార్థులు యువతే ల క్ష్యంగా గంజాయి విక్రయాలు చేస్తున్న ఆరు మందిని స్థానిక పోలీసులు అరెస్టు చేసి గు ట్టు రట్టు చేశారు.నాయుడుపేట డీఎస్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల స మావేశంలో పాల్గొన్న నాయుడుపేట డిఎస్ పి చెంచుబాబు గంజాయి విక్రయ ముఠా వివ రాలను వెల్లడించారు.నాయుడుపేట పట్టణంలో విద్యార్థులు యువత లక్ష్యంగా ఎంచుకొ ని గంజాయ విక్రయాలు చేస్తున్న ఆరు మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.2.50 లక్షలు విలువ గల 11.30కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అలాగే వారి వద్ద ఉన్న నాలుగు సెల్ ఫోన్లు,రెండు మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు తె లియజేశారు.గంజాయి సేవించడానికి అలవాటు పడ్డ 14మంది విద్యార్థులతో పాటు కొం త మంది యువతకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు డీఎస్పీ తెలియజేశారు.
Comments
Post a Comment