కేవలం ఆ 4 గంటలు మాత్రమే సౌండ్ సిస్టమ్...రోడ్డుకు అడ్డంగా ఉండొద్దు...హైకోర్టు సంచలన ఆదేశాలు...
కేవలం ఆ 4 గంటలు మాత్రమే సౌండ్ సిస్టమ్రోడ్డుకు అడ్డంగా ఉండొద్దుహైకోర్టు సంచలన ఆదేశాలు
దేశ వ్యాప్తంగా నేడు గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.ఉత్సవాల కో సం ఊరూవాడా ముస్తాబయ్యాయి.అయితే ఉత్సవాల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు ని బంధనలు విధించింది.సికింద్రాబాద్ ఎంఈఎస్ కాలనీకి చెందిన ప్రభావతి అనే మహిళ తన ఇంటికి ఆనుకుని మండపాలు ఏర్పాటు చేశారంటూ హైకోర్టును ఆశ్రయించింది.ఇం కా పలువురు సైతం గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో పిటిషన్లు వేశారు.పిటిషనర్ల అభ్యంతరా లను పరిష్కరించాలని హైకోర్టు అధికారులను గతంలో ఆదేశించింది.అయినా పట్టించు కో పోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ధ ర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే సమయం లో ప్రజల నుంచి వచ్చే వినతులు,ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని పోలీ సులను,అధికారులను ఆదేశించింది.
హైకోర్టు నిబంధనలు :
1. పొల్యూషన్ యాక్ట్ లోని నిబంధనల మేరకు సాయంత్రం 6-00 గంటలు నుండి రాత్రి 10-00 గంటల వరకు మాత్రమే సౌండ్ సిస్టమ్ను అనుమతించాలి.
2. సౌండ్ ను నిబంధనల ప్రకారం నిర్దేశించిన డెసిబెల్ స్థాయి దాటకుండా చర్యలు తీసు కోవాలి.
3. స్కూల్స్,హాస్పటల్స్,వృద్ధాశ్రమాలు ఉండే వైపు లౌడ్ స్పీకర్లు పెట్టొద్దు.
4. సౌండ్ ను డెసిబుల్ మీటర్లతో ఎప్పటికప్పుడు చెక్ చేయాలి.
5. మండపాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆగిపోకుండా నిర్వాహకులు చూసు కోవాలి.
6. నిమజ్జనాలు పూర్తయిన తర్వాత మండపాలు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని నిర్వాహకు లు శుభ్రం చేయాలి.
7. ఫైర్ ఇంజన్లు,అంబులెన్స్ లు వెళ్లేలా...ట్రాఫిక్కు సమస్య లేకుండా మండపాలు ఏర్పా టు చేయాలి.
8. మండపానికి కరెంట్ కనెక్షన్ ఇవ్వడం కోసం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి.
9. ట్రాఫిక్ కు అడ్డు లేకుండా,ఇళ్లు,ఆస్పత్రులకు వెళ్లే మార్గాలకు ఆటంకం లేకుండా మండ పాలు ఉండాలి.
10. విగ్రహాలను సాధ్యమైనంత వరకు స్థానికంగా ఉన్న బహిరంగ ప్రదేశాలు,కమ్యూనిటీ మైదానాల్లో ప్రతిష్టించాలి.
11. స్థానికుల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు హెల్ప్ డెస్క్లు పోలీస్ స్టేషన్లలో ఏర్పా టు చేసుకోవాలి.
12. మండపాల వద్ద నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి.ఏం జరిగినా వారే బాధ్యత వ హించాల్సి ఉంటుంది.
Comments
Post a Comment