ఇదే స్పూర్తితో 5వ రోజు,9వ రోజు జరిగే నిమజ్జన ఉత్సవాలలో కొనసాగించాలి... విక్రాంత్ పాటిల్, జిల్లా ఎస్పీ...

జిల్లాలో మూడవ రోజు కొనసాగుతున్న వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమాలు
ప్రశాంతంగా కొనసాగేలా భద్రతా చర్యలు చేపట్టిన కర్నూలు పోలీసులు
ఇదే స్పూర్తిని 5వ రోజు,9వ రోజు జరిగే నిమజ్జన ఉత్సవాలలో కొనసాగించాలి
విక్రాంత్ పాటిల్, జిల్లా ఎస్పీ
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2,757 విగ్రహాలు (ఆయా సబ్ డివిజన్ లలో కర్నూలు 612,ఆదోని 143,ఎమ్మిగనూరు 832,పత్తికొండ 1170) నిమజ్జనం జరిగే ప్రాంతాలలో పోలీసు అధికారులు, సిబ్బంది పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని పోలీసు అధికారులను, సిబ్బందిని ఆదేశించామన్నారు.నిమజ్జనం ప్రాంతాలకు చిన్నపిల్లలు,వృద్దులను దూరంగా ఉంచే విధంగా గణేష్ ఉత్సవ నిర్వహకులు చర్యలు తీసుకోవాలన్నారు.వినాయక మండపాలలలో,వినాయక విగ్రహాలు తరలించే సమయంలో వర్షం కురిస్తే విద్యుత్తు తీగల దగ్గర ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.నిమజ్జనం ఉన్న ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సహకరించాలని నిర్వాహకులకు సూచించారు.ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే స్ధానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.జిల్లా ప్రజలందరూ పోలీసులకు సహకరించి,శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే స్థానిక పోలీసుస్టేషన్ లో గాని డయల్ 100 లేదా డయల్ 112నెంబర్ కు కాల్ చేయాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...