పాత్రికేయ గణపతిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది...గౌరు జనార్ధన రెడ్డి,టీడీపీ యువ నాయకులు....
పాత్రికేయ గణపతిని దర్శించుకోవడం ఆనందంగా ఉందిగౌరు జనార్ధన రెడ్డి,టీడీపీ యువ నాయకులు
కర్నూలు కలెక్టరేట్,సమాచార శాఖ భవన్ ప్రాంగణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడి యా పాత్రికేయుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాత్రికేయ శేషనాగ గణపతిని ఆదివారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి,గౌరు వెంకట రెడ్డిల తనయుడు గౌరు జనార్ధన రెడ్డి అ నుచర గణంతో దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులు కేవలం ప్రజలకు,ప్రభుత్వాలకు మధ్య వారదులుగా ఉంటూ, అహర్నిశలు వార్తలను సేకరిస్తూ గడిపే మిత్రులు.ఇలా దేశ వ్యాప్తంగా నిర్వహించే వినా యక చవితి నవరాత్రి కారక్రమాలలో భాగస్వామ్యం కావడం,మట్టి వినాయకుడిని ఏర్పా టు చేసి తమ విలువైన సమయాన్ని ఆ గణనాధుని సేవలో కేటాయించడం అభినందనీ యం అన్నారు.పూజలతోనే కాకుండా ప్రతిరోజు త్రికాల సమయంలో అల్పాహారాలు,అ న్నదానాలు నిర్వహించడం గర్వకారణం అని కొనియాడారు.
అంతే కాకుండా పర్యావరణ పరిరక్షణలో భాగంగా సమాజానికి సైతం ఒక సందేశాన్ని తమ ద్వారా తెలియచే యడం.ప్రతి ఒక్కరిని పర్యావరణ పరిరక్షకులుగా చేయాలనే సం కల్పం ఎనలేనిదని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పాత్రికేయ గణపతి ఉత్సవ క మిటీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చంద్రశేఖర్,మంజునాథ్,రామకృష్ణ,శ్రీనివాసు లు,విద్యాసాగర్,అవినాష్,విజయ్ కుమార్,భూపాల్,రామకృష్ణారెడ్డి,చెన్నయ్య,సురేష్,ర మేష్,గంగాధర్,బండి మోహన్,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment